యాప్నగరం

ఉద్యోగులకు శుభవార్త! పెరగనున్న వేతనాలు? ఎప్పటి నుంచంటే..

వచ్చే ఏడాది నుంచి ఉద్యోగుల వేతనాలు పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్ఆర్ఏ పెంపు నిర్ణయం తీసుకోవచ్చని తెలియజేస్తున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి ఊరట కలుగనుంది.

Samayam Telugu 13 Nov 2021, 8:49 am
ఉద్యోగులకు తీపికబురు అందబోతోందా? వేతనాలు పెరగబోతున్నాయా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu 7th pay commission


నివేదికల ప్రకారం.. 2022 జనవరి నుంచి ఉద్యోగుల జీతం పెరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం హౌస్ రెంట్ అలవెన్స్ HRA పెంచనుండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. 11.56 లక్షలకు పైగా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అమలు చేయాలనే డిమాండ్లను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది.

Also Read: undefined

ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే‌మెన్ హెచ్ఆర్ఏ పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి ఓకే చెబితే జనవరి 1 నుంచి ఉద్యోగుల వేతనాలు పెరగొచ్చు.

Also Read: undefined

కాగా హెచ్ఆర్ఏను ఉద్యోగి నివసిస్తున్న ప్రాంతం ప్రాతిపదికన లెక్కిస్తారు. ఎక్స్, వై, జెడ్ అనే కేటగిరిలు ఉంటాయి. ఎక్స్ కేటగిరి కిందకు వచ్చే ఉద్యోగులకు రూ.5400కు పైగా హెచ్ఆర్ఏ లభించనుంది. వై కేటగిరిలో ఉన్న వారికి హెచ్ఆర్ఏ రూ.3600 పెరగొచ్చు. అదే జెడ్ కేటగిరి అయితే రూ.1800 పెరిగే ఛాన్స్ ఉంది.

50 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాన్ని ఎక్స్ కేటగిరి కిందకు తీసుకుంటారు. వీరికి హెచ్ఆర్ఏ 27 శాతానికి చేరనుంది. వై, జెడ్ కేటగిరిల విషయానికి వస్తే.. హెచ్ఆర్ఏ వరుసగా 18 శాతానికి, 9 శాతానికి చేరొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.