యాప్నగరం

‘కారు’చౌక.. మాల్యా ఆస్తుల వేలం!

మరీ ఇంత చీపా.. లక్షల రూపాయల కార్లు వేల రూపాయలకు అమ్మకం

TNN 29 Aug 2017, 9:54 am
ఆలసించిన ఆశాభంగం.. సెర్చ్ చేయండి, మాల్యా ఆస్తులు ఏవైనా వేలంలో ఉన్నాయమో చూడండి.. ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న వేలంలో విజయ్ మాల్యా ఆస్తులు కొనడానికి ప్రయత్నించండి.. ఎందుకంటే, అవి కారు చౌకగా అమ్ముడవుతున్నాయి! వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్ కు పరారై, అక్కడే మకాం పెట్టిన విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులకు కోర్టు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా వాడిన విలాసవంతమైన కార్లు, ఇతర వాహనాలు, అతడి బంగ్లాలు వేలానికి వచ్చాయి.
Samayam Telugu hubballis biz man purchase mallyas car
‘కారు’చౌక.. మాల్యా ఆస్తుల వేలం!


ఆన్‌లైన్ వేలం పద్ధతిలో అలాంటి వాటి అమ్మకం జరుగుతోంది. మరి ఈ వేలం ప్రక్రియలో అత్యంత చౌక ధరకు కొన్ని కార్లు అమ్ముడు పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మాల్యా వాడిన సోనాటా గోల్డ్, హోండా ఎకార్డ్ కార్లను ముంబై నుంచి ఆన్ లైన్ లో వేలం వేశారు. వీటిని అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకున్నాడు ఒక వ్యాపార వేత్త. అతడి పేరు హనుమంత రెడ్డి, హుబ్లీకి చెందిన బిజినెస్ మ్యాన్.

సొనాటా గోల్డ్ కార్ విలువ కనీసం 14 లక్షలు రూపాయలు. అయితే వేలంలో కేవలం నలభై వేల రూపాయలకే సొంతం చేసుకున్నాడు హనుమంత రెడ్డి. ఇక 21 లక్షల రూపాయల విలువ చేసే ఎకార్డ్ ను కేవలం లక్ష రూపాయలకే సొంతం చేసుకున్నాడు! అంటే దాదాపు 35 లక్షల విలువైన కార్లను కేవలం లక్షా నలభై వేల రూపాయలకే సొంతంచేసుకున్నాడతను.

ఈ కారుచౌక భేరం పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ కార్లను తను కొన్న విషయం తెలిసి.. చాలా మంది అడుగుతున్నారని, భారీ ధరను ఇస్తామని, కార్లను తమకు ఇచ్చేయమని కొంతమంది అడుతున్నారని ఆయన చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.