యాప్నగరం

టీ-హబ్ స్టార్టప్‌కు 'పీపుల్స్ చాయిస్ అవార్డు'

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'టీ-హబ్' అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది.

TNN 24 Jan 2018, 2:38 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'టీ-హబ్' అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. దావోస్‌లో జరిగిన 'ప్రపంచ ఆర్థిక సదస్సు -2018'లో 'బన్యన్ నేషన్ స్టార్టప్' సంస్థ పీపుల్స్ చాయిస్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు పోటీపడ్డాయి. తుది దశలో ఆరు సంస్థలతో పోటీపడి.. 'బన్యన్ నేషన్' అవార్డును దక్కించుకుంది.
Samayam Telugu hyderaba start up banyan nation wins award at davos
టీ-హబ్ స్టార్టప్‌కు 'పీపుల్స్ చాయిస్ అవార్డు'


'ప్రపంచ ఆర్థిక సదస్సు -2018' సందర్భంగా ప్రఖ్యాత డెల్ సంస్థ 'పీపుల్స్ చాయిస్ అవార్డు' కోసం వివిధ స్టార్టప్‌లను అనేక దశల్లో వడపోసింది. తుది దశకు ఎంపికైన ఆరు సంస్థల్లో భారత్ నుంచి ఎంపికైంది 'బన్యన్ నేషన్' ఒకటే కావడం విశేషం. సంస్థ వ్యవస్థాపకుడు మణి వాజ్‌పేయ్ అవార్డును అందుకున్నారు. 'టీ-హబ్'కు చెందిన సంస్థకు అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

బన్యన్ నేషన్ ప్రత్యేకత..

బన్యన్ నేషన్ అనేది స్వదేశీ టెక్నాలజీతో పనిచేసే ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ సంస్థ. ప్లాస్టిక్ వ్యర్థాలను 'బెటర్ ప్లాస్టిక్' అనే సాంకేతిక విధానంతో రీసైక్లింగ్ చేసి, వాటి ఉత్పత్తులను అవసరమైన సంస్థలకు అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు చేయూతనందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.