యాప్నగరం

10 రోజుల్లోనే రూ.5 లక్షలు.. కొత్త సర్వీసులు ప్రారంభించిన కంపెనీ!

MSME Loan: ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 10 రోజుల్లో రూ. 5 లక్షల వరకు క్లెయిమ్స్‌ను సెటిల్‌మెంట్ చేస్తామని వెల్లడించింది. ఇలాంటి సర్వీసులు తీసుకురావడం పరిశ్రమలో ఇదే తొలిసారి అని పేర్కొంది. ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్స్‌కు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. వీటికి సంబంధించి క్లెయిమ్స్‌ను వేగంగా సెటిల్ చేస్తామని ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది.

Authored byKhalimastan | Samayam Telugu 28 Jun 2022, 4:45 pm

ప్రధానాంశాలు:

  • ఐసీఐసీఐ లంబార్డ్ కొత్త సర్వీసులు అందుబాటులో
  • కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది
  • 10 నిమిషాల్లోనే రూ. 5 లక్షల సెటిల్‌మెంట్
  • ఇలాంటి సర్వీసులు తీసుకురావడం ఇదే ప్రథమం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu money
ఐసీఐసీఐ లంబార్డ్ కొత్త సర్వీసులు
Insurance Claim: ప్రైవేట్ రంగానికి చెందిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మాల్ బిజినెస్‌మెన్‌లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. రూ. 5 లక్షల వరకు సూక్ష్మ స్థూల మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) సంబంధిత క్లెయిమ్స్‌ను కేవలం 10 రోజుల్లోనే సెటిల్ చేస్తామని వెల్లడించింది. ఎంఎస్ఎంఈ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఐసీఐసీఐ లంబార్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్‌కు సంబంధించి త్వరితగతిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఉంటుందని తెలిపింది. ఐసీఐసీఐ లంబార్డ్ 2022 మార్చి 31 నాటికి చూస్తే ఎంఎస్ఎంఈలకు దాదాపు 15 లక్షల పాలసీలను విక్రయించింది.
ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి మాట్లాడుతూ.. ఇండియన్ ఎకానమీకి ఎంఎస్ఎంఈలు వెన్నుముక అని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇవి చాలా ప్రతికూల సవాళ్లను ఎదుర్కొన్నాయని, అయినా కూడా అద్భుతమైన పనితీరు ప్రదర్శించాయని పేర్కొన్నారు. స్టార్టప్‌కు సలాం చేస్తున్నాను అని తెలిపారు. అందుకే సలామ్ ఎంఎస్ఎంఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా ఎంఎస్ఎంఈల ప్రాధాన్యతను తెలియజేస్తామని వివరించారు. అంతేకాకుండా 10 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్‌ చేస్తామని తెలిపారు. దీని వల్ల ఎంఎస్ఎంఈలు ఊహించిన ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించొచ్చని పేర్కొన్నారు.

Also Read: undefined

ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్ సాయంతో ఎంఎస్ఎంఈలకు త్వరితగతిన క్లెయిమ్ సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ లంబార్డ్ తెలిపింది. కాగా ఐసీఐసీఐ లంబార్డ్ వివిధ రకాల పాలసీలు అందిస్తోంది. వీటిల్లో గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, మెరిన్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్, ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్, వర్కర్స్ కంపెన్సేషన్, పీఐ ఫర్ డాక్టర్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వంటి ప్రొడక్టులను తన ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉంచింది.

షేరు ధర పడిపోయింది
ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు ధర ఈరోజు పడిపోయింది. 1.05 శాతం మేర క్షీణించింది. షేరు ధర ఈరోజు రూ. 1135.3 వద్ద ప్రారంభం అయ్యింది. అలాగే ఇంట్రాడేలో రూ. 1136 గరిష్టాన్ని తాకింది. అయితే అలాగే రూ. 1103 కనిష్టానికి తగ్గింది. చివరకు రూ. 1118 వద్ద క్లోజ్ అయ్యింది. షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 1674గా ఉంది. 52 వారాల కనిష్ట స్థాయి రూ. 1070.95గా ఉంది. బీఎస్‌ఈలో ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 55028 కోట్లుగా ఉంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.