యాప్నగరం

iD Fresh : ఉద్యోగులను కోటీశ్వరుల్ని చేస్తోన్న సంస్థ, కానుకలు కురిపించింది!

iD Fresh : ఐడీ ఫ్రెష్ ఫుడ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగులను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా కంపెనీ ముందుకెళ్తోంది. సుదీర్ఘకాలంగా కంపెనీ వెంటే ఉండి.. విజయంలో తమ వంతు సహకారం అందించిన ఉద్యోగులకు కానుకలిచ్చింది. ఏడవ రౌండ్ ఈసాప్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ సారి ఈసాప్‌లు ఇచ్చిన ఉద్యోగులలో కంపెనీలో పనిచేసే డ్రైవర్, హెల్పర్‌ కూడా ఉన్నారు. అంటే కంపెనీ లాభాలలో వీరికి కూడా భాగం ఉంటుంది. ఈసాప్‌లతో వీరు కూడా కంపెనీ వాటాదారులుగా మారారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 7 Jul 2022, 6:25 pm

ప్రధానాంశాలు:

  • ఐడీ ఫ్రెష్ ఫుడ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
  • ఉద్యోగులకు ఏడవ రౌండ్ ఈసాప్‌లు
  • 2016 నుంచి రూ.300 కోట్ల ఈసాప్‌ల ప్రకటన
  • కనీసం వంద మందిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu iD Fresh
ఐడీ ఫ్రెష్
iD Fresh : రెడీ టూ కుక్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఐడీ ఫ్రెష్ ఫుడ్ తన ఉద్యోగులకు కానుకలిచ్చింది. ఏడవ రౌండ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్(Esop)ను ప్రకటించింది. కంపెనీ విజయానికి కారకులైన వారిని గుర్తించేందుకు 27 మంది ఉద్యోగులకు ఈసాప్‌లను అందించనున్నట్టు ఐడీ ఫ్రెష్ ఫుడ్ ప్రకటించింది. అమెరికా, బ్రిటన్ మార్కెట్లలో విస్తరించేందుకు తన విస్తరణ కార్యకలాపాలను కూడా ఐడీ ఫ్రెష్ ఫుడ్ ప్రకటించింది. బిలీనియర్ Azim Premji పెట్టుబడులు పెట్టినఈ బెంగళూరు కంపెనీ.. 2016 నుంచి రూ.300 కోట్ల ఈసాప్‌లను తన ఉద్యోగులకు అందించింది.
ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కంపెనీల దీర్ఘకాలిక గ్రోత్‌ నుంచి లాభం పొందేందుకు ఉద్యోగులు చూస్తున్నారు. ఇప్పటి వరకు 54 శాతం ఈసాప్‌లను జూనియర్ మేనేజ్‌మెంట్‌కి కంపెనీ ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఆఫర్ చేసిన రౌండ్‌లో డ్రైవర్‌కి, హెల్పర్‌కి కూడా ఈసాప్‌లను ఐడీ ఫ్రెష్ అందించింది.

‘నేడు మేము ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాం. సుదీర్ఘకాలంగా మాతో కలిసి పనిచేస్తున్నా ఉద్యోగులకు మేము ఎంతో కృతజ్ఞతతో ఉంటున్నాం. ఇప్పటి వరకు మేము సాగించిన స్ఫూర్తివంతమైన ప్రయాణంలో, ఉద్యోగుల సహకారం ఎంతో ఉంది. క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు ఆరు నెలలు ఆలస్యమయ్యాయి. అయినా ఆ రోజుల్లో కూడా ఉద్యోగులు మా వెంటే నిలబడ్డారు. వారి విలువైన సహకారానికి కృతజ్ఞత తెలిపేందుకు ఈసాప్ గ్రాంట్‌ను అందించడం మేము అందిస్తున్న చిన్న సహకారం మాత్రమే’ అని ఐడీ ఫ్రెష్ కోఫౌండర్ పీసీ ముస్తఫా చెప్పారు.

Also Read : Auto Insurance Rules : వాహనదారులకు గుడ్‌న్యూస్, ఎంత డ్రైవ్ చేస్తే అంతే ప్రీమియం

రాబోయే నెలల్లో 2 వేల మందికి పైగా ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంటున్నామని ముస్తఫా తెలిపారు. రాబోయే మూడేళ్లలో కనీసం వంద మంది కోటీశ్వరులను క్రియేట్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అత్యధిక వాల్యూ ఉన్న షేర్లను షేరుని రూ.10కి ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. మార్కెట్ నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకట్టుకోవడానికి, ప్రస్తుతమున్న వారికి కాపాడుకోవడానికి ఈ ప్రొగ్రామ్ సాయపడనుందని తెలిపారు.

ఐడీ ఫ్రెష్‌లో పనిచేసే 80 శాతం మంది ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. వారికి కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, సెల్లింగ్ వంటి వాటిపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఐడీ ఫ్రెషన్ తన బ్రాండ్ కింద దోశ పిండి, రాగి ఇడ్లీ, బియ్యం, రవ్వ ఇండ్లీ పిండి, గోధుమ పరోటా, మలబార్ పరోటాలను ఆఫర్ చేస్తోంది. 2005లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు.

Also read : ఒకేసారి ఉద్యోగులంతా సిక్ లీవ్.. దెబ్బకు దిగొచ్చిన ఇండిగో సంస్థ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.