బిర్యానీలో పురుగు దెబ్బకు ఫర్నీచర్ దిగ్గజం ఐకియా దిగొచ్చింది. తమ హైదరాబాద్ షోరూమ్లో బిర్యానీ, సమోసాల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం (సెప్టెంబర్ 5) ఓ ప్రకటన విడుదల చేసింది. కస్టరమర్ల ఆరోగ్యానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అంతర్గత దర్యాప్తుకు ఆదేశించామని తెలిపింది.
‘సురక్షిత, నాణ్యమైన ఆహార సరఫరాకు ఐకియా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వినియోగదారుల ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహిస్తుంది. ఆగస్టు 31న జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. బిర్యానీలో పురుగు వచ్చిందనే ఫిర్యాదుపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించాం. ఇదే సమయంలో ఐకియా, హైదరాబాద్లో బిర్యానీ, సమోసాలను ఆపేస్తున్నట్లు తెలియజేస్తున్నాం’ అని ఐకియా పేర్కొంది.
స్విజ్జర్లాండ్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా ఆగస్టులో భారత్లో తమ తొలి షోరూమ్ను హైదరాబాద్లోని హైటెక్సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ షోరూమ్లో పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో ఇంటర్నేషనల్ రుచులతో పాటు ఇండియన్ ఫ్లేవర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఐకియాకు బాగా కనెక్ట్ అయిన భాగ్యనగర వాసులు అందులో ఫర్నిచర్ కొన్నా, కొనకపోయినా.. రెస్టారెంట్లో ఫుడ్కు మాత్రం ఎగబడుతున్నారు. ఐకియా హైదరాబాద్ షోరూమ్ ప్రారంభించిన వెంటనే భాగ్యనగరం మొత్తం అక్కడికి క్యూ కట్టింది. తొలి రోజు మాదాపూర్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్, షోరూమ్ వద్ద తోపులాట కూడా జరిగిన విషయం తెలిసిందే. ఫర్నిచర్కు మాత్రమే కాకుండా రెస్టారెంట్ పరంగానూ ఐకియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే అందుక్కారణం. దీనికి తోడు ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టారు.
అలాంటి ఐకియా రెస్టారెంట్లో అబీద్ మొహమ్మద్ అనే కస్టమర్కు వెజ్ బిర్యానీలో పురుగు (గొంగలి పురుగు జాతికి చెందింది) ప్రత్యక్షమైంది. వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఆహార భద్రత విభాగం ఐకియాలో తనిఖీలు నిర్వహించి ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించింది.
ఈ వ్యవహారంపై ఐకియా ఇప్పటికే వివరణ ఇచ్చింది. బిర్యానీలో పురుగు కనిపించిన విషయాన్ని అంగీకరించింది. దీనిపై చింతిస్తున్నట్టు తెలిపిన సదరు సంస్థ, అది తమ కిచెన్లో తయారు కాలేదని, పుణేకు చెందిన హల్దీరామ్స్ నుంచి ఆ ఆహారాన్ని దిగుమతి చేసుకున్నామని వెల్లడించింది.
ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఐకియాతో పాటు హల్దీరామ్స్పై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. మరోవైపు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ సంచులు వాడుతున్నందుకుగాను ఐకియాకు జీహెచ్ఎంసీ రూ.15 వేల జరిమానా విధించడం గమనార్హం.
‘సురక్షిత, నాణ్యమైన ఆహార సరఫరాకు ఐకియా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వినియోగదారుల ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహిస్తుంది. ఆగస్టు 31న జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. బిర్యానీలో పురుగు వచ్చిందనే ఫిర్యాదుపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించాం. ఇదే సమయంలో ఐకియా, హైదరాబాద్లో బిర్యానీ, సమోసాలను ఆపేస్తున్నట్లు తెలియజేస్తున్నాం’ అని ఐకియా పేర్కొంది.
స్విజ్జర్లాండ్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా ఆగస్టులో భారత్లో తమ తొలి షోరూమ్ను హైదరాబాద్లోని హైటెక్సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ షోరూమ్లో పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో ఇంటర్నేషనల్ రుచులతో పాటు ఇండియన్ ఫ్లేవర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఐకియాకు బాగా కనెక్ట్ అయిన భాగ్యనగర వాసులు అందులో ఫర్నిచర్ కొన్నా, కొనకపోయినా.. రెస్టారెంట్లో ఫుడ్కు మాత్రం ఎగబడుతున్నారు. ఐకియా హైదరాబాద్ షోరూమ్ ప్రారంభించిన వెంటనే భాగ్యనగరం మొత్తం అక్కడికి క్యూ కట్టింది. తొలి రోజు మాదాపూర్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్, షోరూమ్ వద్ద తోపులాట కూడా జరిగిన విషయం తెలిసిందే. ఫర్నిచర్కు మాత్రమే కాకుండా రెస్టారెంట్ పరంగానూ ఐకియాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే అందుక్కారణం. దీనికి తోడు ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టారు.
అలాంటి ఐకియా రెస్టారెంట్లో అబీద్ మొహమ్మద్ అనే కస్టమర్కు వెజ్ బిర్యానీలో పురుగు (గొంగలి పురుగు జాతికి చెందింది) ప్రత్యక్షమైంది. వెంటనే ఆయన ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఆహార భద్రత విభాగం ఐకియాలో తనిఖీలు నిర్వహించి ఫుడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపించింది.
ఈ వ్యవహారంపై ఐకియా ఇప్పటికే వివరణ ఇచ్చింది. బిర్యానీలో పురుగు కనిపించిన విషయాన్ని అంగీకరించింది. దీనిపై చింతిస్తున్నట్టు తెలిపిన సదరు సంస్థ, అది తమ కిచెన్లో తయారు కాలేదని, పుణేకు చెందిన హల్దీరామ్స్ నుంచి ఆ ఆహారాన్ని దిగుమతి చేసుకున్నామని వెల్లడించింది.
ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఐకియాతో పాటు హల్దీరామ్స్పై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. మరోవైపు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ సంచులు వాడుతున్నందుకుగాను ఐకియాకు జీహెచ్ఎంసీ రూ.15 వేల జరిమానా విధించడం గమనార్హం.