మహిళలకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలను మరింత మెరుగుపరచాలని ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ అన్నారు. జీఈఎస్లో రెండో రోజైన బుధవారం (నవంబర్ 29) ‘మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి’ అంశంపై జరిగిన ప్లీనరీలో ఆమె ఆలోచనలను పంచుకున్నారు. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ఇవాంక ట్రంప్తో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచ్చర్, డెల్ సీఈవో క్వింటోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందా కొచ్చర్ మాట్లాడుతూ.. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలా మంది మహిళలు కెరీర్ను వదులుకుంటారని, ఆ ఆలోచన చేయొద్దని మహిళలను కోరారు.
మహిళల్లో ఆత్మస్థైర్యం నింపినప్పుడే ముందుకు వెళ్లగలమని చందా కొచ్చర్ చెప్పారు. పిల్లలు, వృద్ధులను చూసుకుంటూ మహిళలు ఇంటి నుంచి పనిచేయొచ్చని ఆమె సూచించారు. టెక్నాలజీని వినియోగించి ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు విద్యావంతులైతే ఒక తరం మొత్తం విద్యావంతమైతుందని ఆమె సేర్కొన్నారు.
విద్య, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారని చందా కొచ్చర్ అన్నారు. భారతదేశంలో మహిళా భాగస్వామ్యం చాలా పెరిగిందని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మహిళలు పనిచేస్తున్నారని, దేశం నుంచి అన్ని విభాగాల్లో మహిళా క్రీడాకారిణులు ఉన్నారని చెప్పారు. నేడు భారత దేశ రక్షణ శాఖా మంత్రిగా కూడా ఓ మహిళా కొనసాగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. తన పిల్లలే తనకు పెద్ద స్ఫూర్తి అని ఆమె చెప్పారు.
సీఎస్ఆర్ ద్వారా మహిళాభివృద్ధికి పాటుపడుతున్నట్లు చందా కొచ్చర్ తెలిపారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి మరిన్ని శిక్షణా కేంద్రాలు అవసరమని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి అవసరం ఉందని చెప్పారు. గ్రామీణ రంగ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. తాము శిక్షణ ఇచ్చినవారిలో 95 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు.
మహిళల్లో ఆత్మస్థైర్యం నింపినప్పుడే ముందుకు వెళ్లగలమని చందా కొచ్చర్ చెప్పారు. పిల్లలు, వృద్ధులను చూసుకుంటూ మహిళలు ఇంటి నుంచి పనిచేయొచ్చని ఆమె సూచించారు. టెక్నాలజీని వినియోగించి ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలు విద్యావంతులైతే ఒక తరం మొత్తం విద్యావంతమైతుందని ఆమె సేర్కొన్నారు.
విద్య, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారని చందా కొచ్చర్ అన్నారు. భారతదేశంలో మహిళా భాగస్వామ్యం చాలా పెరిగిందని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మహిళలు పనిచేస్తున్నారని, దేశం నుంచి అన్ని విభాగాల్లో మహిళా క్రీడాకారిణులు ఉన్నారని చెప్పారు. నేడు భారత దేశ రక్షణ శాఖా మంత్రిగా కూడా ఓ మహిళా కొనసాగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. తన పిల్లలే తనకు పెద్ద స్ఫూర్తి అని ఆమె చెప్పారు.
సీఎస్ఆర్ ద్వారా మహిళాభివృద్ధికి పాటుపడుతున్నట్లు చందా కొచ్చర్ తెలిపారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి మరిన్ని శిక్షణా కేంద్రాలు అవసరమని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి అవసరం ఉందని చెప్పారు. గ్రామీణ రంగ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. తాము శిక్షణ ఇచ్చినవారిలో 95 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు.