యాప్నగరం

సంప‌ద‌లో భార‌త్ మూడో స్థానంలోకి!

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ అన్నారు.

Samayam Telugu 15 Jul 2018, 8:30 am
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ అన్నారు. 2030నాటికి దేశ ఆర్థికం 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుందని, తద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతం త్య్రం వచ్చాక మొదటి 40 ఏళ్లలో భారత్‌ ఏటా 3.5 శాతం మేర వృద్ధి చెందుతూ వచ్చిందని, ప్రస్తుతం 7-8 శాతం అనేది ఒక క‌చ్చిత‌త్వంగా మారిందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాల కార్యక్రమంలో గార్గ్‌ పేర్కొన్నారు. ‘‘ఎకానమీని 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెంచడం సవాలే కాదు మంచి అవకాశం కూడా’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu India growth
మూడో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్‌!


8 శాతం వృద్ధిని సునాయసంగా సాధించగలమని, దీర్ఘకాలంపాటు అదే జోరును కొనసాగించగలిగితే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగడం సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఏడాదిలో భారత్‌ 2.59 లక్షల కోట్ల డాలర్ల జిడిపితో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఈవారంలో ప్రపంచబ్యాంక్‌ ప్రకటించింది. ఇది వరకూ ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌ను భారత్‌ ఒక స్థానం వెనక్కి నెట్టింది. 2022కల్లా భారత్‌లో డిజిటల్‌ ఎకానమీ సైజు లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని, 2030కల్లా ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ ఎకానమీ వాటా సగానికి చేరుకోనుందని గార్గ్‌ అంచనా. మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధి 7.7 శాతంగా నమోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.