చైనా వెనక్కు.. భారత్ ముందుకు అంటున్న రాజన్
చైనా వృద్ధి రేటు నెమ్మదిస్తున్నా, భారత్ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ వస్తోందని రాజన్ గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ మంచి స్థానంలో నిలుచుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Samayam Telugu 23 Jan 2019, 10:17 am
ప్రధానాంశాలు:
- దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మంచి స్థాయికి చేరుకుంటుంది
- చైనా జీడీపీ వృద్ధి రేటు తగ్గుతూ ఉంటే.. భారత్ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోంది
- దావోస్ సదస్సులో రాజన్ వ్యాఖ్యలు
భారత్.. చైనాను అధిగమిస్తుందంటున్నారు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. దక్షిణాసియా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పరంగా చూస్తే కాలక్రమంలో చైనాను భారత్ దాటేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో రాజన్ పాల్గొన్నారు. ‘స్ట్రాటెజిక్ ఔట్లుక్ ఫర్ సౌత్ఏషియా’ అనే అంశంపై ప్రసంగించారు. చైనా వృద్ధి రేటు నెమ్మదిస్తున్నా, భారత్ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ వస్తోందని రాజన్ గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ మంచి స్థానంలో నిలుచుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. చైనా, భారత్ దేశాల మధ్య పోటీ ఇరువురికీ ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో మౌలిక ప్రాజెక్టులపై చైనా పని చేస్తోందన్నారు. భవిష్యత్తులో భారత్ కూడా ఈ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2.59 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో భారత్ ప్రపంచంలో అతి పెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ఇదే సమయంలో చైనా జీడీపీ 12.23 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. మన జీడీపీకి చైనా జీడీపీ దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో చైనాను అధిగమించడానికి భారత్కు ఎంత కాలం పడుతుందో చూడాలి.
కాగా 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2.59 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో భారత్ ప్రపంచంలో అతి పెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ఇదే సమయంలో చైనా జీడీపీ 12.23 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. మన జీడీపీకి చైనా జీడీపీ దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో చైనాను అధిగమించడానికి భారత్కు ఎంత కాలం పడుతుందో చూడాలి.