యాప్నగరం

రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త.. ఏపీ, తెలంగాణలో..

కేంద్ర ప్రభుత్వం తాజాగా 6000వ రైల్వే స్టేషన్‌లో వైఫై సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 500కు పైగా స్టేషన్లలో వైఫై సర్వీసులు ఉన్నాయి. తెలంగాణలో 45 స్టేషన్లలోనే ఈ సేవలు పొందొచ్చు.

Samayam Telugu 17 May 2021, 12:41 pm

ప్రధానాంశాలు:

  • వైఫై సర్వీసుల లాంచ్
  • 6000వ స్టేషన్‌లో వైఫై సేవలు
  • ఏపీ కన్నా తెలంగాణలో తక్కువ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu indian railways
కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందించింది. దేశవ్యాప్తంగా 6 వేల రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా 6000వ రైల్వే స్టేషన్‌లో వైఫై సర్వీసులను కేంద్రం ఆవిష్కరించింది. ఝార్ఖండ్‌లోని హజరీబాగ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ వైఫై సేవలు ప్రారంభించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లలో విడత వారీగా వైఫై సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి దాకా మొత్తంగా 6 వేల రైల్వే స్టేషనల్లో వైఫై సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చ.

మే 15 నాటికి చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 509 రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అదే తెలంగాణలో అయితే 45 స్టేషన్లలో వైఫై సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా 762 స్టేషన్లలో వైఫై సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. మహరాష్ట్రలో కూడా 550 రైల్వే స్టేషన్లలో వైఫై సర్వీసులు వచ్చాయి.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.