యాప్నగరం

నోట్ల రద్దుతో పసిడికి డిమాండ్ తగ్గిపోయిందట!!

నోట్ల రద్దు ప్రభావంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. 2015తో పోల్చుకుంటే 2016లో బంగారం డిమాండ్ 21 శాతం క్షీణించిందని తెలిపింది.

TNN 4 Feb 2017, 12:34 pm
నోట్ల రద్దు ప్రభావంతో పసిడికి డిమాండ్ తగ్గింది. గతేడాది బంగారానికి 21 డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో వెల్లడైంది. నోట్ల రద్దు, నగల వ్యాపారుల సమ్మె, భారీ మొత్తంలో కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి చేయడం లాంటి కారణాలతో పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు నివేదిక పేర్కొంది. 2015లో 857.2 టన్నుల అమ్మకాలు జరగగా, 2016లో 21 శాతం తగ్గి 675.5 టన్నులకు పడిపోయింది.
Samayam Telugu indias gold demand dropped rapidly after demonetisation world gold council
నోట్ల రద్దుతో పసిడికి డిమాండ్ తగ్గిపోయిందట!!


ఆభరణాల డిమాండ్ 22.4 శాతం మేర క్షీణించి 662.3 నుంచి 514 టన్నులకు తగ్గింది. అంటే విలువ పరంగా డిమాండ్ 2015తో పోల్చుకుంటే 12.3 శాతం అంటే సుమారు రూ.20 వేలకోట్ల తగ్గిందని తెలిపింది. రూ. 1,58,310 కోట్ల నుంచి రూ. 1,38,838 కోట్లకు క్షీణించింది. దీపావళి, పెళ్లిళ్లు మొదలైన కారణాలతో నాలుగో త్రైమాసికంలో పసిడికి 3 శాతం డిమాండ్‌ పెరిగినప్పటికీ, ఏడాదికి మొత్తానికి చూసుకుంటే గణనీయంగా పడిపోయింది.

బంగారం కొనుగోళ్లకు పాన్‌ తప్పనిసరి, నగలపై ఎక్సయిజ్‌ డ్యూటీ, నోట్ల రద్దు, ఆదాయ వెల్లడి పథకానికి పెద్ద ఎత్తున ప్రచారం లాంటి కారణాలతో పరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొవడంతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం తెలిపారు. ఈ ధోరణి కేవలం పుత్తడికి మాత్రమే పరిమితం కాలేదని, మిగతా వ్యాపారాలపై కూడా ప్రభావం చూపిందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.