Amazon E Commerce: అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇక భారీ డిస్కౌంట్లు ఉండవ్
ఈ-కామర్స్ పోర్టళ్లలో భారీ డిస్కౌంట్ ఆఫర్లకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఈ-కామర్స్ పోర్టళ్లు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధం విధించింది.
Samayam Telugu 7 Dec 2022, 10:03 am
ప్రధానాంశాలు:
- ఈ-కామర్స్ పోర్టళ్లలో డిస్కౌంట్ల యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది
- ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల ప్రకటించకుండా నిబంధనలను కఠినతరం చేసింది
- వర్తక సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది
పుట్టినరోజో, పండగో వస్తే గతంలో షాపులకెళ్లి బట్టలు, వస్తువులు కొనుగోలు చేసేవాళ్లం. ఆ తర్వాత షాపింగ్ మాల్స్ రావడంతో అన్ని వస్తువులు ఒక్కచోటే దొరుకుతున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగాక ఈ-కామర్స్ వ్యాపారం జోరందుకుంది. ఏ వస్తువు కావాలన్నా మొబైల్ ఫోన్లోనే యాప్ ఓపెన్ చేసి కాళ్ల దగ్గరకే వచ్చేలా చేసుకుంటున్నాం. దీనికి తోడు బయటి కంటే ఈ-కామర్స్ సైట్లలో భారీ డిస్కౌంట్లు ఉండటంతో ప్రజలు వాటివైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మన దేశంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నాయి. అయితే ఇకపై ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులకు ఇచ్చే భారీ డిస్కౌంట్లకు చెల్లుచీటి పడినట్లే. కేంద్రం తీసుకున్న నిర్ణయం అటు ఈ- కామర్స్ సంస్థలకు, ఇటు వినియోగదారులకు నిరాశ మిగల్చనుంది. ఈ-కామర్స్ పోర్టళ్లలో భారీ డిస్కౌంట్ ఆఫర్లకు తెరదించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. ఈ-కామర్స్ పోర్టళ్లు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధం విధించింది. ఏదైనా ఉత్పత్తిని ప్రత్యేకంగా తమ ప్లాట్ఫామ్ పైనే విక్రయించేలా ఎక్స్క్లూజివ్ ఒప్పందాలను కేంద్రం నిషేధించింది. ‘‘ఇకపై ఈ- కామర్స్ పోర్టళ్లు తమకు లేదా తమ గ్రూపు వ్యాపారాలకు ఈక్విటీ వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను తమ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించేందుకు అనుమతి ఉండదు’’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ-కామర్స్ సంస్థ కొనుగోలుదారులకు ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్లు సముచితంగా, వివక్షారహితంగా ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇకపై ఈ-కామర్స్ కంపెనీలు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను నిబంధనలకు లోబడి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపే సర్టిఫికేట్తో పాటు చట్టబద్ద ఆడిటర్ రిపోర్టును ఏటా సెప్టెంబరు 30కల్లా ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయని, దాంతో తమ వ్యాపారాలకు తీవ్రనష్టం కలుగుతోందంటూ దేశంలోని అనేక వర్తక సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.
ఈ-కామర్స్ సంస్థ కొనుగోలుదారులకు ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్లు సముచితంగా, వివక్షారహితంగా ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇకపై ఈ-కామర్స్ కంపెనీలు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను నిబంధనలకు లోబడి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపే సర్టిఫికేట్తో పాటు చట్టబద్ద ఆడిటర్ రిపోర్టును ఏటా సెప్టెంబరు 30కల్లా ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయని, దాంతో తమ వ్యాపారాలకు తీవ్రనష్టం కలుగుతోందంటూ దేశంలోని అనేక వర్తక సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.