యాప్నగరం

Indigo Pilots Increments: మూడో త్రైమాసికంలో భారీ లాభాలు.. ఎగిరి గంతేస్తున్న పైలట్లు.. గుడ్‌న్యూస్ ఏంటంటే?

Indigo Pilots Increments: కరోనా సమయంలో దేశంలో దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విమానయాన రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమానయాన కార్యకలాపాలు మూతబడ్డాయి. కానీ ఇప్పుడు కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడ్డాయి. దీంతో.. మళ్లీ పైలట్లకు వేతన పెంపును పరిశీలిస్తున్నాయి.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 13 Feb 2023, 6:59 pm
Indigo Pilots Increments: కొవిడ్ విజృంభణ సమయంలో దేశంలో దాదాపు అన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. వ్యాపారాలు స్తంభించిపోయాయి. ప్రజలకు జీవించడం కష్టమైపోయింది. ఏం చేయాలో తెలియక ఇంట్లో నుంచి బయటకు రాలేని వారు ఎందరో. ఇక అప్పట్లో విమానయాన రంగం అత్యంత ప్రభావిత రంగాల్లో కచ్చితంగా ఉండి తీరుతుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయిన సంగతి కూడా తెలిసింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. విమానయానం కరోనా ముందటి స్థాయికి చేరింది. దీంతో విమానయాన సంస్థల ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతోంది. నష్టాల నుంచి తేరుకుంటున్నాయి.
Samayam Telugu indigo results pilots


దీంతో విమానయాన సిబ్బందికి తిరిగి జీతాల పెంపుపై దృష్టి పెడుతున్నాయి. ప్రోత్సాహకాల గురించి ఆలోచిస్తున్నాయి. ఇక దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ అయిన ఇండిగో కూడా ఇదే విధంగా పైలట్లకు వేతనాలను పెంచేందుకు సిద్ధమైంది. పైలట్ల వేతన వార్షిక పెంపు ప్రాసెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్‌లో తెలిపింది.


IIT Graduate: మైక్రోసాఫ్ట్ పీకేసింది.. Twitter రెస్పాన్స్ చూసి ఆ ఉద్యోగికి ఆగని కన్నీళ్లు.. ఇంతకీ ఏమైంది..!

కరోనా సంక్షోభం అప్పుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్నాయి. గతంలో వేతనాల్లోనూ కోతలు విధించగా.. ఇప్పుడు కార్యకలాపాలు పూర్వస్థాయికి వచ్చిన తరుణంలో.. పాత వేతన పద్ధతులను పునరుద్ధరించడం మొదలు పెట్టాయి.

ఇక డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో.. ఇండిగో ఏకంగా రూ.1422 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆదాయం కూడా 60 శాతానికిపైగా పెరిగి.. రూ.14,933 కోట్లకు చేరింది. అంతకుముందు మూడు వరుస త్రైమాసికాల్లో మాత్రం నష్టపోవడం గమనార్హం. ఇప్పుడు లాభాలు వచ్చిన తరుణంలో.. ఏటీఆర్ విమానాలను నడిపే పైలట్ల వేతనాలను పెంచే యోచనలో సైతం ఇండిగో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫ్లైట్స్ ఆపరేషన్స్ విభాగ ఉపాధ్యక్షుడు మిత్రా తెలిపారు. త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని చెప్పారు. సాధారణంగా ఎయిర్‌బస్ పైలట్లతో పోలిస్తే.. ATR విమానాల పైలట్లకు తక్కువే వేతనాలు ఉంటాయి. మరోవైపు.. నవంబర్‌లోనే ఇండిగో పైలట్ల వేతనాలను కరోనా మునుపటి స్థాయికి చేర్చింది.


కశ్మీర్‌లో లక్షల కోట్ల విలువైన లిథియం డిపాజిట్లు.. Anand Mahindra కీలక వ్యాఖ్యలు


Read Latest Business News and Telugu News
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.