యాప్నగరం

Palm Oil : హమ్మయ్య.. నిషేధం ఎత్తివేత.. ఎట్టకేలకు దిగిరానున్న ఆయిల్ ధరలు

సలసలమంటోన్న వంటనూనెల ధరలు ఎట్టకేలకు దిగిరానున్నాయి. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయంతో మన దేశంలో కూడా వంట నూనెల ధరల తగ్గనున్నాయి. పామాయిల్ పరిశ్రమలో పనిచేస్తోన్న కోట్లాది మంది కార్మికుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 19 May 2022, 5:32 pm

ప్రధానాంశాలు:

  • దేశీయంగా తగ్గనున్న వంటనూనెల ధరలు
  • పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం ఎత్తివేత
  • సోమవారం నుంచి నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటన
  • ఏప్రిల్ 18 నుంచి పామాయిల్‌పై బ్యాన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Palm Oil
పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత.. ఇండోనేషియా
హమ్మయ్యా.. ఎట్టకేలకు పామాయిల్ ధరల విషయంలో భారత్‌కు కాస్త ఊరట లభించబోతుంది. పామాయిల్ ఎగుమతులపై సోమవారం నుంచి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. దేశీయంగా వంట నూనెల సరఫరా మెరుగుపడటంతో.. ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో(Joko Widodo) గురువారం తెలిపారు. ఆ దేశంలో పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తుండటంతో.. దేశీయంగా ధరలు దిగిరానున్నాయని తెలుస్తోంది. బల్క్ వంటనూనె ధర లీటరుకు తాము నిర్దేశించుకున్న 14 వేల రూపాయ(IDR)కి చేరకముందే.. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని తాము నిర్ణయించినట్టు ఆ దేశ అధ్యక్షుడు వీడియో సందేశంలో తెలిపారు. పామాయిల్ పరిశ్రమలో పనిచేస్తోన్న 1.7 కోట్ల మంది కార్మికుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారి. ఈ దేశం ఏప్రిల్ 28 నుంచి వంటనూనెల ఎగుమతులపై నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దేశీయంగా వరదల కారణంతో పంటలు దెబ్బతినడంతో.. సప్లయిలో కొరత నెలకొంది. దీంతో వంట నూనెల ధరలు పెరిగాయి. దానికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకాయి. పెరుగుతోన్న ధరలను, సప్లయిని దృష్టిలో ఉంచుకుని ఈ నూనెల సరుకు రవాణాపై నిషేధాన్ని విధించింది ఇండోనేషియా. ఈ నిషేధం విధించినప్పటికీ.. ధరలు దిగిరాకపోగా.. లక్షల కొద్ది డాలర్ల రెవెన్యూను ఈ దేశం కోల్పోయిందని పలు రిపోర్టులు తెలిపాయి. దేశీయ అవసరాలను చేరుకున్న తర్వాతనే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తామని అధ్యక్షుడు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సప్లయి మెరుగుపడిందని ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పారు.

ప్రస్తుతం ఇండోనేషియాలో పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడంతో మన దేశంలో వంటనూనెల ధరలు దిగి రాబోతున్నాయి. మన దేశ వంటనూనెల అవసరాల్లో 60 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో పామాయిల్‌ను మనం ఎక్కువగా ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉండటంతో.. ఈ నిర్ణయం మనకు కాస్త రిలీఫ్ ఇవ్వనుంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన సమయంలో దేశీయంగా ధరలు పెరిగాయి. దీంతో పామాయిల్ ఉత్పత్తిని దేశీయంగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం ప్రారంభించింది.

Also Read : పోస్టాఫీసు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై మనీ ఇలా పంపించుకోవచ్చు!

Also Read : నానో కారులో తాజ్ హోటల్‌కి రతన్ టాటా.. సింప్లిసిటీకి జై కొడుతోన్న నెటిజన్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.