Infosys: ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఐటీ కంపెనీల్లో అంటే మంచి జీతం, 5 రోజుల పని, ఇతర ప్రోత్సాహకాలు అన్నీ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇంకా ఐటీ కంపెనీలు బోనస్, ఇన్సెంటివ్స్ మాత్రమే కాకుండా.. షేర్లను కూడా ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ కింద ఇస్తుంటాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్.. అర్హులైన ఉద్యోగులకు ఏకంగా 5.11 లక్షల వరకు షేర్లను కేటాయించింది. రెండు ఉద్యోగ సంబంధిత పథకాల కింద మే 12న షేర్లకు సంబంధించిన కేటాయింపు పూర్తి చేసింది. ఈ రెండు స్టాక్ ఆప్షన్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. కంపెనీలో ఉద్యోగుల ఓనర్షిప్ను పెంచుకోవడం కాగా.. మరొకటి ఉద్యోగుల పనితీరుకు ప్రతిఫలంగా కూడా ఈ షేర్లను కేటాయించడం చేస్తోంది ఇన్ఫీ.
మే 14న ఎక్స్చేంజి ఫైలింగ్లో ఇన్ఫోసిస్ దీని గురించి ప్రకటన చేసింది. 2023, మే 12న కంపెనీ .. 5,11,862 ఈక్విటీ షేర్లను అర్హులైన ఉద్యోగులకు కేటాయించడం జరిగిందని వెల్లడించింది. ఈ మొత్తం షేర్లను రెండు స్కీమ్స్ కింద జారీ చేసింది. 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 షేర్లను ఉద్యోగులకు కేటాయించగా.. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 కింద 4,07,527 షేర్లను కేటాయించింది.
మంచి ప్రతిభ ఉన్న ఉద్యోగులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉద్యోగులను నిలుపుకోవడం, వారిని ప్రోత్సహించడం కోసం 2015 ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ స్కీమ్ తీసుకొచ్చింది ఇన్ఫోసిస్. ఇంకా వ్యక్తిగత పనితీరు, ప్రదర్శన ఆధారంగా కూడా ఎక్కువ షేర్లను పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఇది కేవలం ఉద్యోగులకు రివార్డు మాత్రమే కాకుండా.. వారికి షేర్లను కేటాయించడం ద్వారా వారు వాటాదారుల్లో భాగస్వామ్యం అవుతారు. కంపెనీ యాజమాన్యంలోనూ చేరే అవకాశాలుంటాయి.
ఇక ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 అనేది.. కంపెనీలో ఉద్యోగి ఓనర్షిప్ను పెంచి.. షేర్హోల్డర్ వాల్యూను కూడా పెంచాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా ఉద్యోగులకు సంస్థ పట్ల నమ్మకం కలిగించేందుకు, ప్రతిభ ఉన్న వారిని వెలికితీసేందుకు ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టింది ఇన్ఫీ కంపెనీ. ఇక ప్రస్తుతం ఇవాళ ఇన్ఫోసిస్ షేరు ధర ఒక శాతానికిపైగా పెరిగి రూ. 1261.70 వద్ద కొనసాగుతోంది. దీని మార్కెట్ విలువ రూ.5.22 లక్షల కోట్లుగా ఉంది.
మీ ఫోన్ పోయిందా? కొత్త వ్యవస్థ అమల్లోకి.. వెంటనే ట్రాక్ చేసి బ్లాక్ చేయొచ్చు!
- Read Latest Business News and Telugu News