యాప్నగరం

జపాన్ ఫోన్లతో.. చైనాకు చెక్! సాధ్యమేనా?

భారత మార్కెట్లో వేళ్లూనుకున్న చైనా మొబైల్ ఉత్పత్తులకు చెక్ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘హద్దులు’ దాటి ప్రవర్తిస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలంటే.. వారి ఉత్పత్తులపై భారత ప్రభుత్వం పూర్తిగా నిషేదం విధించవచ్చు...

TNN 18 Sep 2017, 4:57 pm
భారత మార్కెట్లో వేళ్లూనుకున్న చైనా మొబైల్ ఉత్పత్తులకు చెక్ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘హద్దులు’ దాటి ప్రవర్తిస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలంటే.. వారి ఉత్పత్తులపై భారత ప్రభుత్వం పూర్తిగా నిషేదం విధించవచ్చు కదా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అది అంత సులభమైన ప్రక్రియ కాదని ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు.
Samayam Telugu is japan replace mobile products of china
జపాన్ ఫోన్లతో.. చైనాకు చెక్! సాధ్యమేనా?


ఇప్పటికే చైనాకు చెందిన సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాయి. ఆయా సంస్థల్లో కొన్ని లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తొందరపాటు చర్యలు మంచివి కాదానే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం ఈ విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్‌తో స్నేహాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

చైనాతో పోల్చితే జపాన్‌కు చెందిన బ్రాండెడ్ సంస్థలు ఇండియాలో పెద్దగా ఆధరణ పొందలేదనే చెప్పాలి. సోనీ, పెనసోనిక్, డొకొమో సంస్థలు ఉనికిలో ఉన్నా, చైనా ఉత్పత్తులకు లభిస్తున్నంత ప్రచారం వాటికి లేదు. మొబైల్ వ్యాపారంలో సోనీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పైగా చైనా ఉత్పత్తులు జపాన్ కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో జపాన్ ఉత్పత్తులు ఇండియాలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలను పెద్దగా ఆకర్షించడం లేదు. చైనా తరహాలోనే జపాన్ కూడా తమ ఉత్పత్తులను అందుబాటు ధరల్లోకి లభించేలా ప్రయత్నాలు చేస్తే.. తప్పకుండా చైనా ఉత్పత్తులకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిషేదిస్తే ఏం జరుగుతుంది?
చైనా ఉత్పత్తులను నిషేదిస్తే దేశంలో వాణిజ్య లోటు ఏర్పడుతుందని స్వయంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రే వెల్లడించారు. చైనా నుంచి అత్యధిక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌తో పాటు టెక్నాలజీ ఉత్పత్తుల దేశాలతో వాణిజ్య సత్సంబంధాలు భారత్ పెంపొందించుకోవాలి.

ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేసినా, ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను స్వాగతించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా ఉత్పత్తులు చైనా తరహాలోనే ప్రజల్లోకి వెళ్లి మెప్పు పొందాల్సి ఉంటుంది. మరి, ఇదంతా జరగాలంటే.. అంత సులభమైన పనికాదు. ఈ పరిస్థితే ఇప్పుడు చైనాకు బలంగా మారింది. చైనా మళ్లీ కాలు దువ్వితే.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.