యాప్నగరం

SBI Loan: గ్యారెంటీ తీసుకోకుండానే మహిళలకు ఎస్‌బీఐ రూ.25 లక్షల రుణం..! ఈ వార్తలో నిజమెంత? ప్రభుత్వం ఏం చెబుతోంది?

SBI Loan: ఎన్నో వైరల్ మెసేజ్‌లు మిమ్మల్ని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేస్తున్నాయి. ఇటీవల ఈ తప్పుడు వార్తల ప్రచారం మరీ ఎక్కువైంది. ప్రభుత్వం ఈ స్కీమ్ ఇస్తుంది.. ఆ స్కీమ్ ఇస్తుందంటూ ఒకటే మెసేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాక పలు యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇస్తూనే ఉంటుంది. ఈ వార్తల్లో ఉన్న నిజమెంత? అబద్దమెంతా..? ప్రజలు ఎలా వీటి బారిన పడకుండా ఉండాలో తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా సూచిస్తూ ఉంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 13 Sep 2022, 7:27 am

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తప్పుడు మెసేజ్‌లు
  • యూట్యూబ్ ఛానల్స్‌లో ప్రభుత్వం నడిపే పథకాలపై తప్పుడు ప్రచారం
  • నారి శక్తి యోజన కింద ఎస్‌బీఐ మహిళలకు రూ.25 లక్షలు ఇస్తుందంటూ వార్తలు
  • అలాగే ప్రధానమంత్రి కన్య సమ్మాన్ యోజన కింద నెలనెలా రూ.2500 అంట
  • ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu SBI
ఎస్‌బీఐ
SBI Loan: ఇటీవల చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలను మీరు నిజమని నమ్మారో ఇక అంతే సంగతులు. సైబర్ మోసాలకు మీరు బాధితులుగా మారిపోతారు. ఇటీవల యూట్యూబ్ ఛానల్స్‌లో ప్రభుత్వం నడిపే పథకాల గురించి ఎన్నో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ వైరల్ మెసేజ్‌లు, వీడియోలపై ప్రభుత్వం తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇస్తూనే ఉంది.
తాజాగా ఒక వైరల్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఎలాంటి గ్యారెంటీ తీసుకోకుండానే ఎస్‌బీఐ మహిళలకు రూ.25 లక్షలు రుణమిస్తుందని ఉంది. దీనిపై ఎస్‌బీఐ ఎలాంటి వడ్డీ కూడా విధించడం లేదట. కేంద్రానికి చెందిన ‘నారి శక్తి యోజన’ పథకం కింద దేశంలోని మహిళలందరికీ కూడా ఎలాంటి గ్యారెంటీ, వడ్డీ లేకుండా ఈ రూ.25 లక్షలను అందిస్తుందని మెసేజ్‌లో ఉంది. ఇదే సమయంలో మరో వైరల్ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన మంత్రి కన్య సమ్మాన్ యోజన కింద కూడా ప్రతి నెలా ఆడపిల్లలకు రూ.2,500ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఉంది. ఈ మనీ నేరుగా పిల్లల బ్యాంకు అకౌంట్లో పడతాయని చెబుతోంది. ఇది మాత్రమే కాక.. చాలా యూట్యూబ్ ఛానల్స్ మహిళా స్వరోజ్‌గార్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికీ అకౌంట్లలోకి డబ్బులు వేస్తుందని చెబుతున్నాయి.

Also Read : Gold Silver Prices: ఓ రేంజ్‌లో పెరిగిన వెండి ధరలు.. బంగారం మాత్రం..

ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. చాలా యూట్యూబ్ ఛానల్స్ అందించే పలు ప్రభుత్వ పథకాల సమాచారం.. అసలు రియాల్టీలో లేవని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. మోసగాళ్లు అందించే కంటెంట్ బారిన పడొద్దని, జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. వీడియోలు అందించే వెబ్‌‌సైట్లపై మీ వ్యక్తిగత సమాచారం షేర్ చేయొద్దని పీఐబీ తెలిపింది. అలాంటి కంటెంట్ కనిపిస్తే.. ఏం చేయాలో కూడా వివరించింది.మీ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు దుర్వినియోగ పరిచే అవకాశముందని పేర్కొంది.



ఇలాంటి సమాచారం కనిపిస్తే.. వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సాయంతో ఆ వార్తల్లో నిజమెంతో తెలుసుకోవాలని సూచించింది. ఎవరైనా కూడా ఈ వార్తలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కి స్క్రీన్‌షాట్లు పంపొచ్చని, ట్వీట్ చేయొచ్చని, ఫేస్‌బుక్ యూఆర్ఎల్‌ను పంవచ్చని చెప్పింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నెంబర్ 918799711259, మెయిల్ ఐడీ pibfactcheck@gmail.com.

Also Read : MCLR పెంచిన ప్రభుత్వ బ్యాంకు.. ఇక నెలనెలా ఈఎంఐల మోత మోగనుంది

Read latest Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.