యాప్నగరం

హైదరాబాద్‌ రానున్న ఇవాంక ట్రంప్, ఎందుకంటే?

భారత్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్న అరుదైన సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ రానున్నారు.

TNN 8 Aug 2017, 2:27 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ త్వరలోనే హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 28న జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆమె భాగ్యనగరం వస్తున్నట్లు సమాచారం. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హజరుకానున్నారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును ప్రారంభించగా.. ఈసారి ఎనిమిదో సదస్సు జరగనుంది. గత జూన్లో అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ భారత్‌లో ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇవాంక ట్రంప్‌ను కోరారు.
Samayam Telugu ivanka trump will head to hyderabad in november end to participate in ges
హైదరాబాద్‌ రానున్న ఇవాంక ట్రంప్, ఎందుకంటే?


ఈ సదస్సు నిర్వహణ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కూడా పోటీ పడ్డాయి. కానీ హైదరాబాద్‌కున్న అనుకూలతల వల్ల ఈ సదస్సు నిర్వహించే అవకాశం చివరికి భాగ్యనగరికే దక్కింది. కేంద్రం సూచనల మేరకు ఈ సదస్సు నిర్వహణ కోసం నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. భారత్ తొలిసారిగా ఈ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానుంది.

ఈ సదస్సులో వర్క్ షాప్‌లను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నారు. 2010లో జరిగిన తొలి సదస్సుకు వాషింగ్టన్ ఆతిథ్యం ఇవ్వగా.. తర్వాతి ఏళ్లలో ఇస్తాంబుల్, దుబాయ్, కౌలాలంపూర్, మర్రాకేష్, నైరోబీ, సిలికాన్ వ్యాలీల్లో వరుసగా ఈ సదస్సును నిర్వహించారు. స్టారప్ట్‌ ఇండియాలో భాగస్వామ్యం ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ ఏడాది ప్రధానంగా మహిళా వ్యాపారవేత్తల పురోగతిపై దృష్టి సారించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.