యాప్నగరం

ఉద్యోగులకు శుభవార్త.. ఏడాదికి రూ.340తో రూ.10 లక్షల ఇన్సూరెన్స్!

ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏకంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఎంప్లాయీస్‌కు రూ.10 లక్షల పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అందించేందుకు రెడీ అయ్యింది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొంత మందికి మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది.

Samayam Telugu 4 Dec 2019, 4:55 pm
ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏకంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ఎంప్లాయీస్‌కు రూ.10 లక్షల పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అందించేందుకు రెడీ అయ్యింది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కొంత మందికి మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది.
Samayam Telugu jammu and kashmir government employees to get rs 10 lakh accident insurance cover
ఉద్యోగులకు శుభవార్త.. ఏడాదికి రూ.340తో రూ.10 లక్షల ఇన్సూరెన్స్!


ఎవరెవరికి వర్తిస్తుంది?

జమ్మూ అండ్ కశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగులకు ఈ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తోంది. దీంతో దాదాపు 3.5 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. అడ్మిస్ట్రేషన్ ఇప్పటికే ఈ ఇన్సూరెన్స్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది.

Also Read: వామ్మో.. నెలకు కేవలం రూ.100తో ఏకంగా రూ.36,000 పెన్షన్!

గ్రూప్ కవరేజ్

ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తింపునకు ఆమోదం లభించింది. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ సేవలను ఉద్యోగులకు అందించనుంది. డిసెంబర్ 2 నుంచి మూడేళ్ల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

Also Read: ఎస్‌బీఐ డెబిట్ కార్డులు పనిచేయవు.. ఈలోగా మార్చేసుకోండి.. లేదంటే...

వీరందరికీ వర్తింపు

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం జమ్మూ అండ్ కశ్మీర్‌లోని దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులకు పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ లభిస్తుంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, డైలీ రేటెడ్ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది.

Also Read: గుడ్ న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

సంవత్సరానికి రూ.346

గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ విషయానికి వస్తే.. ఉద్యోగికి రూ.10 లక్షల కవరేజ్ లభిస్తుంది. దీని కోసం ఏడాదికి రూ.346 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అతితక్కువ మొత్తంతో ఎక్కువ కవరేజీ లభిస్తోంది. దీంతో లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: SBIలో డబ్బులు పెడితే అదిరిపోయే లాభం.. ఏకంగా 26 శాతం రాబడి!?

ప్రీమియం చెల్లింపు ఇలా

ప్రభుత్వ డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్లు ఉద్యోగుల వేతనాల నుంచి పాలసీ ప్రీమియం డబ్బులను కట్ చేసుకుంటారు. ఉద్యోగుల 2019 డిసెంబర్ నెల వేతనం నుంచి రూ.346 కట్ అవుతుంది. ఇది తప్పనిసరి. ఉద్యోగులందరి జీతాల నుంచి ప్రీమియం డబ్బు కట్ చేసుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.