యాప్నగరం

విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్..

విమాన టికెట్ ధరలు పెరగబోతున్నాయి. ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు ఏటీఎఫ్ ధరలను మరోసారి పెంచేశాయి. దీని వల్ల రానున్న కాలంలో ఫ్లైట్ టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల విమాన ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం పడనుంది. తాజాగా ఏటీఎఫ్ ధర రూ. 6 వేలకు పైగా పెరిగింది. తాజా పెంపును పరిగణలోకి తీసుకుంటే ఏటీఎఫ్ ధర ఇప్పుడు కిలోలీటరుకు రూ.1.23 లక్షలకు చేరింది.

Authored byKhalimastan | Samayam Telugu 16 May 2022, 9:44 am

ప్రధానాంశాలు:

  • ఏటీఎఫ్ ధరలను పెంచేసిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ
  • కిలోలీటరుకు రూ.6 వేలకు పైగా పెంపు
  • దీని వల్ల పెరగనున్న ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ కాస్ట్
  • అంతిమంగా టికెట్ ధరల పెంపు ఉండే అవకాశం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu flight
విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. జెట్ ఫ్యూయెల్ ధర మరోసారి పైకి కదిలింది. దీంతో ఫ్లైట్ జర్నీ మరింత భారంగా మారనుంది. విమాన టికెట్ల ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) IOC తాజాగా విమాన ఇంధనం ధరను 5 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కిలోలీటరుకు రూ. 6188 పెరిగింది. దీని వల్ల ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర ఇప్పుడు రూ. 1.23 లక్షలకు చేరింది. ఈ కొత్త రేటు మే నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఇది వరకు ఏటీఎఫ్ ధర రూ. 1.16 లక్షలుగా ఉండేది. జనవరి నుంచి చూస్తే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ATF ధర 61.7 శాతం మేర పెరిగింది. రూ. 72,062 నుంచి రూ. 1.23 లక్షలకు చేరింది. కాగా మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 40 రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 119.47 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ. 105.47 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
అలాగే ఇంద్రప్రస్థా గ్యాస్ (ఐజీఎల్) కూడా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరను మే 15న పెంచేసింది. రేటు కేజీకి రూ. 2 మేర పెరిగింది. దీని వల్ల ఢిల్లీలో సీఎన్‌జీ రేటు రూ. 73.61కు చేరింది. నోయిడాలో ఈ రేటు రూ. 76.17కు, గురుగ్రామ్‌లో రూ. 81.94కు ఎగసింది.

జెట్ ఫ్యూయెల్ పెరుగుదల వల్ల ఎయిర్ ట్రావెల్ మరింత భారం కానుంది. ఎందుకంటే విమానయాన కంపెనీల ఖర్చుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూయెల్‌ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది 40 శాతం వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని వల్ల ఏటీఎఫ్ ధరలు పెరిగితే ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ వ్యయాలు కూడా పెరుగుతాయి. దీంతో కంపెనీలు టికెట్ ధరలను పెంచే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు ఏటీఎఫ్ ధరను పెంచుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఫ్యూయెల్ రేట్లు ప్రతి నెలా రెండు సార్లు సమీక్షిస్తూ ఉంటాయి. నెల ఆరంభంలో, అలాగే 16వ తేదీన ధరల సవరణ ఉంటుంది. ఇకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సమీక్షిస్తూ ఉంటాయి. అలాగే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం నెలకు ఒకసారి ఒకటో తేదీని సమీక్షిస్తాయి.

Also Read: undefined

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.