యాప్నగరం

జియోతో స్యాంసంగ్..70 శాతం క్యాష్ బ్యాక్..!

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్యాంసంగ్... సంచలన టెల్కో.. రిలయెన్స్ జియోతో జతకట్టింది. స్యామ్‌సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ల అమ్మకం కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది.

TNN 21 Mar 2018, 3:35 pm
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్యాంసంగ్... సంచలన టెల్కో.. రిలయెన్స్ జియోతో జతకట్టింది. స్యామ్‌సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్ల అమ్మకం కోసం రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్లు రిలయన్స్ డిజిటల్‌, జియో వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా స్యాంసంగ్ ఎస్‌9ప్లస్ (256 జీబీ) వేరియంట్ ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు జియో 70 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. దీంతో పాటు స్యాంసంగ్ ఎస్9 (256 జీబీ) ఫోన్లపై రిలయన్స్ డిజిటల్స్ రూ.6 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది.
Samayam Telugu samsung1


ఈ క్యాష్‌బ్యాక్ పొందాలనుకునేవారు... జూన్ 15లోగా కొత్త ఫోన్‌లో జియో సిమ్ వేసుకుని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో అందిస్తున్న ఏదో ఒక ప్లాన్‌లో 12 నెలల పాటు రూ.2500 విలువైన లేదా ఆపైన రీచార్జ్ చేసుకోవాలి. అప్పడు వారు ఆటోమేటిగ్గా ఈ ఆఫర్‌కు ఆర్హులవుతారు. కాగా ప్రస్తుతం జియో వెబ్‌సైట్లో గెలాక్సీ ఎస్9ప్లస్ (256జీబీ) ఫోన్ రూ.72,900 ధరకు లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.