యాప్నగరం

Jio 5G: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో 9 పట్టణాల్లో జియో 5జీ సేవలు..!

Jio 5G: ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని పట్టణాలకు జీయో 5జీ సేవలు చేరువయ్యాయి. ఇప్పటికే ఏపీలోని ప్రధాన పట్టణాల్లో జియో సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 9 నగరాలు ఈ జాబితాలో చేరాయి. కొత్తగా దేశవ్యాప్తంగా 41 పట్టణాలకు రిలయన్స్ ట్రూ 5జీ సేవలను విస్తరించింది జియో. అందులో ఏపీలో 9 పట్టణాలు ఉన్నాయి. ఆ వివరాలేంటీ, జాబితాలో ఉన్న ఏపీ నగరాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 21 Mar 2023, 5:11 pm
Jio 5G: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన 5జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశంలోని మరిన్ని నగరాలు, పట్టణాలకు ఈ సేవలను విస్తరించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు మరో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 41 నగరాలు, పట్టణాలకు 5జీ (Reliance Jio 5G Services) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తంగా 406 నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది.
Samayam Telugu Jio 5G
జియో 5జీ


'దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లకు జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంతో త్రిల్లింగ్‌గా ఉన్నాం. మల్టిపుల్ డిజిటల్ టచ్‌పాయింట్స్ ద్వారా వారి జీవితనాలను మరింత వృద్దిలోకి తీసుకొచ్చేందుకు మా నెట్ వర్క్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ' అని తెలిపారు జియో ప్రతినిధి ఒకరు. అత్యంత వేగంగా జియో 5జీ సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన 41 నగరాల్లో వెల్‌కమ్ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్ డేటాను అందుకోవచ్చని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 9 పట్టణాలు..
కొత్తగా 5జీ సేవలను విస్తరించిన 41 నగరాలు, పట్టణాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 9 పట్టణాలు ఉన్నాయి. ఆ జాబితాలో ఏపీలోని ఆదోని, చిలకలూరిపేట, బద్వేల్, కదిరి, గుడివాడ, నరసాపురం, రాయచోటి, తాడేపల్లిగూడెం, శ్రీకాళహస్తి నగరాలు ఉన్నాయి. ఆయా నగరాల్లో ప్రస్తుతం జియో యూజర్లకు 5జీ సేవలను అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే విజయవాడ, తిరుమల, తిరుపతి, విశాఖ, చిత్తూరు, కడప, రాజమహేంద్రవరం, నరసారావుపేట, విజయనగరం, శ్రీకారుళం, కాకినాడ, ఏలూరు, కర్నూలు, గుంటూరు వంటి నగరాల్లో జియో 5జీ సేవలను అందుబాటులోకి వచ్చాయి.

జియో అందిస్తున్న 5జీ సేవలను అందుకునేందుకు 5జీ సపోర్ట్ చేసే మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. సిమ్ కార్డును మార్చాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. జియో 5జీ వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది జియో.


రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.