యాప్నగరం

మార్కెట్లోకి 'జియోఫై' వైర్‌లెస్ డేటాకార్డు!

రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ సారి కొత్త 'జియోఫై జేఎంఆర్815 వైర్‌లెస్ డేటా కార్డు'తో వినియోగదారుల ముందుకొచ్చింది. దీని ధర రూ.999 మాత్రమే.

TNN 21 Mar 2018, 4:26 pm
రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ సారి కొత్త 'జియోఫై జేఎంఆర్815 వైర్‌లెస్ డేటా కార్డు'తో వినియోగదారుల ముందుకొచ్చింది. దీని ధర రూ.999 మాత్రమే. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ డివైస్‌పై ఏడాది వారెంటీ కూడా ప్రకటించింది. 'డిజైన్డ్‌ ఇన్‌ ఇండియా' నినాదంతో ఈ డివైస్‌ను జియో ప్రవేశపెట్టింది.
Samayam Telugu jioFi


దీని డౌన్‌లోడ్‌ స్పీడు.. 150ఎంబీపీఎస్‌ వరకు, అప్‌లోడ్‌ స్పీడు 50ఎంబీపీఎస్‌ వరకు ఉంది. ఒక్కసారి కనెక్ట్‌ అయితే స్మార్ట్‌ఫోన్లలోని జియో 4జీ వాయిస్‌ యాప్‌తో హెచ్‌డీ వాయిస్‌, వీడియో కాల్స్‌ను పొందవచ్చు.

దీనిద్వారా ఒకే సమయంలో 32 మంది వినియోగదారులు హై-స్పీడు డేటా సేవలు పొందవచ్చు.ఈ కొత్త జియోఫైలో స్టోరేజ్‌ను 64జీబీ వరకు విస్తరించేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌ కూడా ఉంది. 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఇది లభించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.