యాప్నగరం

పండగ పూట కస్టమర్లకు షాకిచ్చిన జియో

అన్ని టెలీకాం సంస్థలు పండగ పూట ఆఫర్లు ఇస్తుంటే.. జియో మాత్రం షాకిచ్చింది.

TNN 18 Oct 2017, 9:20 pm
పండగ పూట రిలయన్స్ జియో కస్టమర్లకు షాకిచ్చింది. రోజుకు 1 జీబీ చొప్పున 84 రోజులపాటు ఉచిత డేటాను అందించే ప్లాన్ ధరను పెంచేసేంది. రూ. 399 స్థానంలో గురువారం నుంచి రూ. 459తో రీచార్జ్ చేసుకుంటేనే 84 రోజుల ప్లాన్ మీ సొంతం అవుతుందని తెలిపింది. ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది 15 శాతం అదనమని వెబ్‌సైట్ ద్వారా స్పష్టం చేసింది.
Samayam Telugu jios 84 day plan hiked to rs 459 double data in rs149 scheme
పండగ పూట కస్టమర్లకు షాకిచ్చిన జియో


రూ. 149 ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదని జియో తెలిపింది. దివాలీ ధమాకాలో భాగంగా.. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో 2 జీబీ డేటాకు బదులు 4 జీబీ డేటా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఒకవారం వ్యాలిడిటీతో రూ. 52 ప్లాన్, రెండు వారాల వ్యాలిడిటీతో రూ. 98 ప్లాన్ల ద్వారా ఉచిత వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా (రోజుకు 0.15 జీబీ) అందిస్తామని తెలిపింది.

రోమింగ్‌లో ఉన్నప్పటికీ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుండగా.. ఈ ప్లాన్లను కొనసాగిస్తామని జియో స్పష్టం చేసింది. రూ. 509 ప్లానులో అందిస్తున్న ప్రయోజనాల్లో కూడా సంస్థ కోత పెట్టింది. ఇప్పటి వరకూ 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ చొప్పున డేటా ఆఫర్ చేస్తుండగా.. దాన్ని 49 రోజులకు తగ్గించింది. 98 జీబీల వాడకం తర్వాత డేటా వేగం తగ్గుతుందని తెలిపింది. గతంలో ఈ పరిమితి 112 జీబీగా ఉండేది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.