యాప్నగరం

జులై 1: 'జీఎస్టీ డే' వేడుకలు నిర్వహించనున్న కేంద్రం..

ఒకే దేశం- ఒకే పన్ను’ నినాదంతో కేంద్రం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జులై 1వ తేదీని ‘జీఎస్టీ డే’గా ప్రభుత్వం జరపనుంది. ఆదివారం (జులై 1) దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి జీఎస్టీ వేడుకలు జరపనున్నారు.

Samayam Telugu 30 Jun 2018, 11:20 pm
ఒకే దేశం- ఒకే పన్ను’ నినాదంతో కేంద్రం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో జులై 1వ తేదీని ‘జీఎస్టీ డే’గా ప్రభుత్వం జరపనుంది. ఆదివారం (జులై 1) దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి జీఎస్టీ వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్‌ గోయల్‌ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు.
Samayam Telugu gst


జీఎస్టీ రాకతో దాదాపు 500 రకాల పన్నులు ఒకే పన్నుగా అవతరించాయి. పార్లమెంటు సెంట్రల్‌ హాలు సాక్షిగా గతేడాది జూన్‌ 30 అర్ధరాత్రి 12 గంటలకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జీఎస్టీ ఆవిష్కృతమైంది. జీఎస్టీ అమల్లో సమస్యలు చాలావరకు అధిగమించామని ఆర్థికశాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా అన్నారు. టెక్నాలజీ సమస్య కొంతవరకు ఉందని.. దానిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రిటైర్న్స్ ఫైలింగ్‌లో ఉన్న సమస్యలను తొలగిస్తున్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా.. ఒక విధానంలో అయితే ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. మరో విధానంలో కేంద్రం ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.