యాప్నగరం

ఫ్రీచార్జ్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా కార్తీక్ రాజేశ్వరన్

డిజిటల్ పేమేంట్స్ ప్లాట్‌ఫాంలో దూసుకుపోతున్న ఫ్రీచార్జ్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా కార్తీక్ రాజేశ్వరన్‌ నియమితులయ్యారు.

TNN 13 Oct 2016, 2:14 pm
డిజిటల్ పేమేంట్స్ ప్లాట్‌ఫాంలో దూసుకుపోతున్న ఫ్రీచార్జ్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా కార్తీక్ రాజేశ్వరన్‌ నియమితులయ్యారు. కార్తీక్‌కు గ్లోబల్ స్టార్టప్ ఇకోసిస్టమ్‌లో అపారమైన అనుభముందని, అంతేకాకుండా వినియోగదారుల ఏం కోరుకుంటారో కూడా ఆయనకు బాగా తెలుసని సంస్థ వెల్లడించింది. కార్తీక్‌ను తమ సంస్థలోకి ఆహ్వానించడంపై చాలా ఆనందంగా ఉన్నామని, ఆయన సాయంతో డిజిటల్ వినియోగదారులకు అందించే సేవలను మరింత వేగవంతం చేస్తామని కపెంనీ సీఈవో గోవింద్ రాజన్ వెల్లడించారు.
Samayam Telugu karthik rajeshwaran appointed freecharges director of strategy
ఫ్రీచార్జ్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా కార్తీక్ రాజేశ్వరన్

ఫ్రీచార్జ్ లాంటి ఐకానిక్ బ్రాండ్‌తో కలసి పనిచేయడం మంచి అవకాశామని, ఈ సంస్థలో చేరడం చాలా ఆనందంగా ఉందని కార్తీక్ రాజేశ్వరన్ చెప్పారు. ఫ్రీచార్జ్‌ను దేశంలో ప్రభావవంతమైన డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాంగా మార్చడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఫ్రీచార్జ్‌లో చేరడానికి ముందు కార్తీక్ ఓబీఐ వరల్డ్‌ఫోన్ సంస్థలో పనిచేశారు. వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌తో పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణ, సంస్థ ప్రచార బాధ్యతలను చూసుకునేవారు. కార్తీక్ తన కెరీర్‌ను హిందుస్థాన్ యూనీలీవర్‌లో ప్రారంభించారు. లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఆయన డిగ్రీ పొందారు. అలాగే విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.