యాప్నగరం

కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. రూ.9 వేల తగ్గింపు..!

కొత్త స్కూటర్ కొనాలనుకునే వారికి తీపికబురు. ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఆంపియర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరను తగ్గించేసింది. ఏకంగా రూ.9 వేల కోత విధించింది. దీంతో కొనే వారికి ఊరట కలుగనుంది.

Samayam Telugu 22 Jun 2021, 6:48 am

ప్రధానాంశాలు:

  • స్కూటర్లపై భారీ తగ్గింపు
  • రూ.9 వేల వరకు ఆదా
  • కారణం ఇదే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu scooter offer
కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ.9 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కొత్తగా స్కూటర్ కొనే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.
ఆంపియర్ వెహికల్స్ కంపెనీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తాజాగా తన జీల్ ఎలక్ట్రిక్ వెహికల్ ధరను భారీగా తగ్గించేసింది. ఈ స్కూటర్ ధర ఇదివరకు రూ.68,990గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ ధర రూ.59,990కు దిగొచ్చింది.

అదేసమయంలో మాగ్నస్ ప్రో వెహికల్ ధర రూ.74,990గా ఉండేది. దీని ధర ఇప్పుడు రూ.65,990కు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడ స్కీమ్‌లో సవరణలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తే.. ఇది మంచి తరుణం అని చెప్పొచ్చు.

Also Read: undefined

Also Read: గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ లోన్ గురించి తెలుసా? తీసుకుంటే కలిగే బెనిఫిట్స్ ఇవే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.