యాప్నగరం

Interest Rates:శుభవార్త చెప్పిన బ్యాంకు, డబ్బులు దాచుకున్న వారికి ఎక్కువ ఆదాయం!

Interest Rates: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను పెంచిన తర్వాత చాలా బ్యాంకులు వరుస బెట్టి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. రుణ గ్రహీతలకు షాకిస్తూ.. తమ బ్యాంకులలో డబ్బులు దాచుకున్న వారికి గుడ్‌న్యూస్ చెబుతున్నాయి. తాజాగా మరో బ్యాంకు తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కొటక్ మహింద్రా బ్యాంకు తన ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంచిన రేట్లు కూడా నేటి నుంచే అమల్లోకి తెచ్చింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 17 Aug 2022, 1:16 pm

ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్లు పెంచిన కొటక్ మహింద్రా బ్యాంకు
  • ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీలు పెంపు
  • పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి
  • మానిటరీ పాలసీలో రెపోను పెంచిన ఆర్‌బీఐ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Interest rates
వడ్డీ రేట్ల పెంపు
Interest Rates: కొటక్ మహింద్రా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ రేట్లను పెంచింది. ఏడాది నుంచి మూడేళ్ల టెన్యూర్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు కొటక్ మహింద్రా బ్యాంకు ప్రకటించింది. రూ.2 కోట్ల తక్కువున్న మొత్తాలకు ఇది వర్తిస్తుంది. నేటి నుంచే అంటే ఆగస్టు 17,2022 నుంచి ఈ పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి.
365 రోజుల నుంచి 389 రోజుల టెన్యూర్ కలిగిన ఎఫ్‌డీ వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.75 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఈ రేటు కేవలం 5.60 శాతంగా మాత్రంగానే ఉండేది. అలాగే 390 రోజుల నుంచి మూడేళ్ల టెన్యూర్ కలిగిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు 5.90 శాతానికి పెరిగాయి. అంతకుముందు ఈ రేట్లు 5.75 శాతంగా ఉండేవి. మూడేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్ కలిగిన వడ్డీ రేట్లను కొటక్ మహింద్రా బ్యాంకు మార్చలేదు. ఈ రేట్లు 5.90 శాతంగానే కొనసాగుతున్నాయి.

రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు..
ఆరు నెలల టెన్యూర్ కలిగిన రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటును కొటక్ మహింద్రా బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల టెన్యూర్ కలిగిన రికరింగ్ డిపాజిట్లపై బ్యాంకు 5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. 12 నెలల వడ్డీ రేటును 5.60 శాతం నుంచి 5.75 శాతానికి పెంచింది.

ఆర్‌బీఐ రెపో రేటు పెంపు..
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత.. బ్యాంకులు కూడా డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి.

Also Read :SBI: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక స్కీమ్ లాంచ్ చేసిన ఎస్‌బీఐ

Also Read :SBI ట్వీట్.. వారికి ఉచితంగా ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.