యాప్నగరం

మార్కెట్లోకి కేటీఎం 125 డ్యూక్ బైకులు.. ధరెంతో తెలుసా?

ఆరెంజ్, వైట్, బ్లాక్ వేరియంట్లలో కేటీఎం 125 డ్యూక్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Samayam Telugu 27 Nov 2018, 4:25 pm
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్.. 'కేటీఎం 125 డ్యూక్‌ ఏబీఎస్' బైకులను భారత్‌లో విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూమ్‌లో దీని ధరను రూ.1,18,163 గా నిర్ణయించారు. ఆస్ట్రియా కంపెనీ కేటీఎంలో 49 శాతం వాటా ఉన్న బజాజ్‌ ఆటోకు చెందిన 'చకన్‌' ప్లాంట్‌లోనే కొత్త కేటీఎం బైకులను తయారుచేస్తున్నారు. యమహా ఆర్‌15 వీ3.0, టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200, బజాజ్‌ పల్సర్‌ ఎన్‌200లతో 125 డ్యూక్‌ పోటీపడే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కేటీఎం 125 డ్యూక్ మోడల్ సక్సెస్ అయితే.. త్వరలోనే డ్యూక్ 200, డ్యూక్ 390 మోటార్ బైక్‌లు కూడా తెచ్చే ఆలోచనలో సంస్థ ఉంది. 125 సిసి శ్రేణిలో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన మోటార్ బైక్‌గా 'కేటీఎం 125 డ్యూక్‌ ఏబీఎస్' బైక్ నిలిచింది.
Samayam Telugu ktm



ఆరెంజ్, వైట్, బ్లాక్ వేరియంట్లలో కేటీఎం 125 డ్యూక్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 6-స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, సింగిల్‌ సిలిండర్‌ 124.7 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు గరిష్ఠంగా 14.5 పాస్కల్ శక్తిని విడుదలచేయగలదు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్లస్ 110/70 , 150/60 ఎంఆర్ఎఫ్ ఆర్ఈజడ్- ఎఫ్ సీ టైర్స్ కూడా అదనపు ఆకర్షణ కానున్నాయి. 10.2 లీటర్ల నిల్వ సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.