యాప్నగరం

LIC Aadhaar Shila Scheme: రోజుకు రూ.58 పొదుపు చేస్తే.. ఇలా 8 లక్షలు చేతికి.. ఈ ప్రభుత్వ స్కీమ్ అదిరిపోయిందిగా!

LIC Aadhaar Shila Scheme: మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా? లేదా బిజినెస్ చేస్తున్నా.. డబ్బులు పొదుపు చేసుకోవడం అత్యంత అవసరం. ప్రజలు డబ్బులను సేవింగ్స్ చేసుకోవడం చేసుకోవడం కోసం చాలా పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. డబ్బులను పొదుపు చేసుకునేందుకు ప్రభుత్వ పథకాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రోజుకు చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే ఒక ప్రభుత్వ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 15 Jan 2023, 11:03 am
LIC Aadhaar Shila Scheme: సంపాదించడం గొప్ప కాదు. దానిని నిలబెట్టుకోవడం గొప్ప. పొదుపు చేసుకోవడం గొప్ప. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం గొప్ప. ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో సంపాదించేవారు చాలా మందే ఉంటారు. కానీ వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం చాలా తక్కువే ఉంటుంది. కారణం ఖర్చులు పెరిగిపోవడం, ఖర్చు చేయడం. అందుకే డబ్బులను పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. డబ్బులను కూడబెట్టుకోవాలంటే.. మంచి పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ముఖ్యం. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా డబ్బులు పోవడం, నష్టపోవడం వంటి ప్రమాదం ఉండదు. ఇంకా రోజుకు చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినా మెచ్యూరిటీ సమయానికి పెద్ద మొత్తంలో మీ చేతికి అందుతుంది.
Samayam Telugu LIC Aadhaar Shila Scheme


ఇప్పుడు మనం అలాంటి ఒక ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుకుందాం. చిన్న మొత్తాల్లో డిపాజిట్ చేస్తూ.. పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేలా చేసుకోవచ్చు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పథకం (LIC Scheme). ఎల్ఐసీ నుంచి ప్రస్తుతం ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వాటిల్లో ఒకటి ఎల్‌ఐసీ ఆధార్ శిలా స్కీమ్. మహిళల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పిస్తూ కేవలం మహిళల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పోస్టాఫీస్, బ్యాంక్ పథకాల్లాగే.. ఈ ఎల్‌ఐసీ స్కీమ్‌తో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రెండు సార్లు చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అదానీ.. సక్సెస్‌కు కారణమదే అంటూ..!

ఈ స్కీమ్‌లో భాగంగా మహిళలు కనిష్టంగా రూ.75 వేలు, గరిష్టంగా రూ.3 లక్షల పాలసీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. చిన్న, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఎన్నో ఎల్‌ఐసీ ప్లాన్లలాగే ఇది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీనే. ఒకవేళ పాలసీదారు మరణించిన పక్షంలో వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా దక్కుతుంది.

జీవన కాల గరిష్టాలకు బంగారం ధర.. ఇవాళ తులం రేటు ఎంతంటే?

8 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వరకు మహిళలు అందరూ ఈ ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీలో చేరేందుకు అర్హులు. దీంట్లో 10 సంవత్సరాల నుంచి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా చాలా చిన్న మొత్తంలో అంటే రోజుకు కేవలం రూ.58, నెలకు రూ. 1740 చొప్పున సంవత్సరానికి రూ.21,918 అవుతుంది. ఇలా 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 4,29,392 అవుతుంది. మెచ్యూరిటీ సమయానికి మీకు ఏకంగా రూ. 7,94,00 అందుతుంది.

లక్షను రూ.2.46 కోట్లు చేసిన స్టాక్.. రెండేళ్లలోనే కళ్లుచెదిరే లాభం.. మీ దగ్గరుందా?

ఇలానే రోజుకు రూ.29 ఇన్వెస్ట్ చేస్తే.. పెట్టుబడి రూ.2,14,000 అవుతుంది. మీ రిటర్న్స్ రూ.3,97,000 అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇందులో ఇన్వెస్ట్ చేసి మంచి సేవింగ్స్ ఇప్పటినుంచే అలవర్చుకోండి.


20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: మీ పీఎఫ్ అకౌంట్ UAN నంబర్ మర్చిపోయారా? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..
కేవైసీపై RBI కీలక నిర్ణయం.. ఇక పదే పదే బ్యాంకులకు వెళ్లక్కర్లేదా?
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.