యాప్నగరం

Adani Group: అదానీ గ్రూప్‌కు LIC ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చిందో తెలుసా? నిర్మలమ్మ అంతా చెప్పేశారుగా..

Adani Group: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇచ్చిన రుణాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. లోక్‌సభకు సోమవారం ఈ విషయాలు వెల్లడించారు. ఎన్ని వేల కోట్ల రుణాలు ఉన్నాయంటే?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 2 Apr 2023, 12:56 pm
Adani Group: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC).. అదానీ గ్రూప్‌కు ఇచ్చిన రుణాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. లోక్‌సభకు సోమవారం రాతపూర్వకంగా ఈ విషయాలను వెల్లడించారు. మార్చి 5 నాటికి ఎల్‌ఐసీ (LIC).. అదానీ గ్రూప్‌కు (Adani Group) రూ.6,183 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఈ రుణాలు 2022, డిసెంబర్ 31 నాటికి రూ.6,347 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో అదానీ గ్రూప్‌లోని ఏ కంపెనీ.. ఎల్‌ఐసీ నుంచి ఎంత మేర రుణాలు తీసుకుందో కూడా నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) వివరించారు. ఆ వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. అత్యధికంగా అదానీ పోర్ట్స్ అండ్ SEZ కు రూ. 5 వేల కోట్లకుపైగా రుణాలు ఇచ్చింది ఎల్‌ఐసీ.
Samayam Telugu adani lic


LIC .. అదానీ గ్రూప్ సంస్థలకు ఇచ్చిన రుణాలను ఓసారి పరిశీలిస్తే..

అదానీ Ports &SEZ- రూ. 5,388.60 కోట్లు
అదానీ పవర్ (Mundra) - రూ. 266 కోట్లు
అదానీ పవర్ (మహారాష్ట్ర- ఫేజ్ 1) - రూ. 81.60 కోట్లు
అదానీ పవర్ (మహారాష్ట్ర- ఫేజ్ 3) - రూ.254.87 కోట్లు
రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ - రూ.45 కోట్లు
రాయ్‌పుర్ ఎనర్జెన్- రూ.145.67 కోట్లు

ఎల్‌ఐసీ మినహా ప్రభుత్వ రంగంలోని మిగతా 5 సాధారణ బీమా కంపెనీలు.. అదానీ గ్రూప్ సంస్థలకు రుణాలు గానీ, క్రెడిట్ ఎక్స్‌పోజర్ (Credit Exposure) గానీ చేయలేదని వివరించారు నిర్మలమ్మ. అయితే అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో మొత్తం 10 లిస్ట్ అయితే.. అందులో ఏడింటిలో ఎల్‌ఐసీ షేర్లను కలిగి ఉంది.

Adani Stocks Fall: అదానీ గ్రూప్ షేర్ల పతనం.. వేల కోట్ల లాభాల నుంచి నష్టాల్లోకి LIC.. ఎన్ని కోట్ల లాస్ అంటే?

ఇదే సమయంలో.. ఇటీవల అదానీ గ్రూప్ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి కమిటీని నియమించలేదని లోక్‌సభకు వెల్లడించారు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరీ. అదానీ గ్రూప్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, అకౌంటింగ్ మోసాలు జరిగాయని జనవరి 24న అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండన్‌బర్గ్ రీసెర్చ్ .. ఆరోపించిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్‌కు చెందిన 9 నమోదిత కంపెనీలు (ndtv తప్ప) అప్పటినుంచి మార్చి 1 వరకు సుమారు 60 శాతం మార్కెట్ విలువ కోల్పోయాయని, దీనిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విచారణ జరుపుతోందని చెప్పారు మంత్రి. అదానీ షేర్ల పతనం నిఫ్టీ 50 పై పెద్దగా ప్రభావం చూపలేదని, ఆ సమయంలో నిఫ్టీ 4.5 శాతం మాత్రమే పడిపోయిందని అన్నారు.

ఎల్‌ఐసీ.. అదానీ గ్రూప్‌లో పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్లపై కొంతకాలంగా పెనుదుమారం రేగుతోంది. వేల కోట్ల లాభం నుంచి నష్టాల్లోకి రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం గ్రూప్ షేర్లు మళ్లీ పుంజుకుంటున్నందున ఇప్పుడు స్వల్ప లాభాల్లో ఉండొచ్చు. ఇక ఇప్పుడు అదానీ.. వరుసగా ముందస్తు లోన్ చెల్లింపులు చేపడుతుండటం కారణంగా.. అదానీ గ్రూప్ షేర్లకు పునర్వైభవం వచ్చినట్లు కనిపిస్తోంది.

Adani Group: మాట నిలబెట్టుకున్న Adani.. మళ్లీ గడువుకు ముందే వేల కోట్ల అప్పులు కట్టేశారుగా.. ఇక అడ్డు లేనట్లేనా? Siddhartha Mohanty: అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై ఆరోపణలు.. LIC కి కొత్త ఛైర్మన్.. ఒక్కసారిగా మార్చింది అందుకోసమేనా?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.