యాప్నగరం

మారటోరియం పొడిగించే ఆలోచనలో ఆర్బీఐ.. ఈసారి వారికి మాత్రమే ?

ఆగస్టు 31తో మారటోరియం ముగియనుంది. దీంతో ఈ విషయంపై ఆర్బీఐ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కొన్ని రంగాలకు మాత్రమే మినహాయిపులు ఇచ్చి మారటోరియం పెంచే ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సమాచారం.

Samayam Telugu 23 Jul 2020, 1:32 pm
కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత తొలుత మూడు నెలల పాటు అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించింది ఆర్బీఐ. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కొంత కాలం మారటోరియాన్ని పొడిగించే ఆలోచనలో ఉంది. ఇప్పటికీ చాలా రంగాలు లాక్ డౌన్ ప్రభావం నుంచి బయటపడక పోవడంతో ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu ఆర్బీఐ

rbi



ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని, అయితే, అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే యోచన చేస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.
Read More: కేవలం ఒక్క రూపాయి చెల్లించి.. 24 క్యారెట్స్ బంగారం కొనండి
లాకడౌన్‌తో ఆదాయం కోల్పోయిన రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ మారటోరియం ప్రకటించింది. మార్చి నుంచి అమల్లోకి వచ్చిన మారటోరియం ఆగస్టు 31తో ముగియనుంది. మారటోరియం గడువు ముగిశాక ఈఎంఐ డిఫాల్ట్‌లు ఒక్కసారిగా పెరగవచ్చని, మారటోరియం ఎంచుకున్న రుణ ఖాతాల్లో చాలావరకు మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.