యాప్నగరం

టికెట్ బుకింగ్స్ ఆపేయండి .. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం

coronavirus in india: దేశీయ, అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీస్‌ల‌కు సంబంధించి బుకింగ్స్‌పై తాజాగా డీజీసీఏ స్పందించింది. ప‌లు విమాన‌యాన సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 19 Apr 2020, 9:05 pm
లాక్‌డౌన్ న‌డుస్తున్న కాలంలో కొన్ని విమాన‌యాన సంస్థ‌లు టికెట్ బుకింగ్స్ ప్రారంభించ‌డంపై ద డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అభ్యంతరం వ్య‌క్తం చేసింది. విమాన‌యాన స‌ర్వీసుల‌ను ప్రార‌భించడంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆదివారం తెలిపింది. అందుచేత టికెట్ బుకింగ్‌ల‌ను నిర్వ‌హించ‌రాద‌ని ఆదేశించింది. అంత‌కుముందు ఇండిగో, ఏయిర్ ఇండియా సంస్థ‌లు మే 4 నుంచి విమాన‌యాన స‌ర్వీస్‌లు ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో దేశీయ ప్ర‌యాణాల కోసం టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించాయి.
Samayam Telugu Mumbai: Aeroplanes on runway as all the domestic and international flights were ...


Must Read: క‌రోనాకు కుల, మ‌తాల బేధం లేదు: ప‌్ర‌ధాని మోదీ

దీనిపై కేంద్ర పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వులను డీజీసీఏ గుర్తు చేసింది. ఈ ఉత్త‌ర్వుల్లో దేశీయ, అంత‌ర్జాతీయ విమాన‌యాన స‌ర్వీస్‌ల‌ను ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. అలాగే టికెట్ బుకింగ్స్ ప్రారంభించ‌డం గురించి కూడా తెల‌ప‌లేద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతానికి విమాన స‌ర్వీస్‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపింది.

Must Read:మోదీ ప్ర‌భుత్వం యూ ట‌ర్న్‌.. ఆ ఉత్త‌ర్వులు వెనక్కి

అంత‌కుముందు విమాన స‌ర్వీస్‌ల‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే ఏయిర్‌లైన్స్ సంస్థ‌లు బుకింగ్స్ ప్రారంభించాల‌ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి ఆదేశించారు. ఇప్ప‌టివ‌ర‌కైతే త‌మ మంత్రిత్వ‌శాఖ విమాన ప్ర‌యాణాల‌పై ఎలాంటి నిర్ణ‌యాల‌ను తీసుకోలేద‌ని మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి స్ప‌ష్టం చేశారు. ఇక మ‌న‌దేశంలో లాక్‌డౌన్ వ‌చ్చేనెల 3 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.