హైదరాబాద్ లో మీరూ ఎలక్ట్రిక్ కార్లు
రేడియో ట్యాక్సీ సేవల్లో ప్రముఖంగా ఉన్న మీరూ క్యాబ్స్ హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనుంది.
Samayam Telugu 23 Apr 2018, 10:37 am
రేడియో ట్యాక్సీ సేవల్లో ప్రముఖంగా ఉన్న మీరూ క్యాబ్స్ హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ సెడాన్ అయిన ఈ -వెరిటోస్ మోడల్ కార్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మేరు వసూలు చేస్తున్న చార్జీలతోనే కొత్త కార్లను నడపనున్నారు. ఈ మేరకు మీరూ సంస్థ.. మహీంద్రాతో ఒప్పందం చేసుకుంది.
పైలట్ ప్రాజెక్టు కింద తొలుత భాగ్యనగరంలో మీరూ ఈ సేవలను ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. దశలవారీగా ఇతర నగరాల్లోనూ ఈ-వెరిటోస్ ప్రవేశపెడతామని కంపనీ సీఈవో నీలేష్ సంగోయ్ తెలిపారు. నాలుగు సంవత్సరాల్లో సంస్థ నడిపే మొత్తం కార్లలో ఎలక్ట్రిక్ కార్లే అత్యధికంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. సీఎన్జీ అందుబాటులో ఉన్న నగరాల్లో అన్ని వాహనాలకు గ్రీన్ ఫ్యూయల్ కంపెనీ కార్లలో వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరిగేందుకు నాయకత్వం వహిస్తామని మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈవో మహేష్ బాబు చెప్పారు.
పైలట్ ప్రాజెక్టు కింద తొలుత భాగ్యనగరంలో మీరూ ఈ సేవలను ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు. దశలవారీగా ఇతర నగరాల్లోనూ ఈ-వెరిటోస్ ప్రవేశపెడతామని కంపనీ సీఈవో నీలేష్ సంగోయ్ తెలిపారు. నాలుగు సంవత్సరాల్లో సంస్థ నడిపే మొత్తం కార్లలో ఎలక్ట్రిక్ కార్లే అత్యధికంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. సీఎన్జీ అందుబాటులో ఉన్న నగరాల్లో అన్ని వాహనాలకు గ్రీన్ ఫ్యూయల్ కంపెనీ కార్లలో వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరిగేందుకు నాయకత్వం వహిస్తామని మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈవో మహేష్ బాబు చెప్పారు.