బిలియనీర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్ అకౌంట్ కలిగిన వారికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఆవిష్కరణలను, ఐడియాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈసారి కూడా ఇలాంటి ఘటనే ఒకటే చోటుచేసుకుంది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ షేరు చేసిన ఒక వీడియో ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోలోని మెషీన్ సాయంతో అరేకా గింజ చెట్లను సులభంగా ఎక్కొచ్చు. మెషీన్పై కూర్చుంటే చాలు అదే మనల్ని చెట్టు పైకి తీసుకెళ్తుంది. అలాగే కిందకు తీసుకువస్తుంది. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు.ఒక లీటరు పెట్రోల్తో దాదాపు 80 చెట్లను ఎక్కొచ్చు. 60 నుంచి 80 కేజీల బరువును మోయగలదు. దీన్ని కర్నాటకకు చెందిన రైతు గణపతి భట్ తయారు చేశారు.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియో ట్వీట్ను రీట్వీట్ చేశారు. ట్వీట్తోపాటు ‘ఎంత బాగుంది? ఈ పరికరం సమర్థవంతమైనదిగా తెలుస్తోంది. అంతేకాకుండా దీన్ని తక్కువ బరువుతో బాగా డిజైన్ చేశారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ ఉపకరణాల విభాగాపు ప్రెసిడెంట్ రాజేశ్ జెజురికర్ను ఈ మెషీన్ గురించి తెలుసుకోవాలని సూచించారు. కంపెనీ వ్యవసాయ ఉపకరణల్లో భాగంగా ఆ మెషీన్ను మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందేమో చూడాలని కోరారు.
ఆనంద్ మహీంద్రా ఓపెన్ ప్లాట్ఫామ్పైనే మెషీన్ మార్కెటింగ్ గురించి ప్రకటించడంతో నెటిజన్లు కూడా స్పందించారు. ‘సార్.. మీకు ఇలా బహిరంగంగానే మార్కెటింగ్ గురించి మాట్లాడితే మీ ప్రత్యర్థులు మీ కన్నా ముందే గణపతిని సంప్రదించొచ్చు’ అని పేర్కొన్నారు.
దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘గణపతికి మంచి డీల్స్ రావాలి. ఎంట్రప్రెన్యూర్లకు ఇలాంటి ప్రోత్సాహం లభించాలి’ అని తెలిపారు. దీనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆనంద్ మహీంద్రాపై మరోసార ప్రశంసలు కురిపించారు.
ఆనంద్ మహీంద్రా ఈ వీడియో ట్వీట్ను రీట్వీట్ చేశారు. ట్వీట్తోపాటు ‘ఎంత బాగుంది? ఈ పరికరం సమర్థవంతమైనదిగా తెలుస్తోంది. అంతేకాకుండా దీన్ని తక్కువ బరువుతో బాగా డిజైన్ చేశారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ ఉపకరణాల విభాగాపు ప్రెసిడెంట్ రాజేశ్ జెజురికర్ను ఈ మెషీన్ గురించి తెలుసుకోవాలని సూచించారు. కంపెనీ వ్యవసాయ ఉపకరణల్లో భాగంగా ఆ మెషీన్ను మార్కెట్లో విక్రయించే అవకాశం ఉందేమో చూడాలని కోరారు.
దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘గణపతికి మంచి డీల్స్ రావాలి. ఎంట్రప్రెన్యూర్లకు ఇలాంటి ప్రోత్సాహం లభించాలి’ అని తెలిపారు. దీనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆనంద్ మహీంద్రాపై మరోసార ప్రశంసలు కురిపించారు.