Mahindra Scorpio-N : మార్కెట్లోకి లాంచైన మహింద్రా కొత్త స్కార్పియో.. ఎస్యూవీలన్నింటికి బిగ్ డాడీ!
మహింద్రా కొత్త కొత్త కార్లతో వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఎక్స్యూవీ700తో మార్కెట్లో అలరించిన మహింద్రా తాజాగా.. తన సరికొత్త లోగోతో సరికొత్త ఎస్యూవీని లాంచ్ చేసింది. స్కార్పియో-ఎన్ పేరుతో ఈ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చింది. దేశంలో ఉన్న అన్ని ఎస్యూవీలకు ఇది బిగ్ డాడీగా మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఈ కొత్త ఎస్యూవీ కావాలంటే మాత్రం పండగ సీజన్ వరకు ఆగాల్సిందే. డెలివరీలు పండగ సీజన్లో చేపడతామని కంపెనీ చెబుతోంది.
ప్రధానాంశాలు:
- మార్కెట్లోకి మహింద్రా కొత్త ఎస్యూవీ స్కార్పియో-ఎన్
- ఏడు సీట్లతో మార్కెట్లోకి వచ్చిన వెహికిల్
- జూలై 30 నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తోన్న కంపెనీ
- పండగ సీజన్ నుంచి డెలివరీ చేస్తామని వెల్లడి
దేశంలో అతిపెద్ద ఎస్యూవీ తయారీదారి మహింద్రా అండ్ మహింద్రా తన సరికొత్త ఎస్యూవీ Scorpio-N ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఏడు సీట్లతో ఇది భారత మార్కెట్లోకి వచ్చింది. అలెక్సా ఎనాబుల్డ్ వాట్3వర్డ్స్తో వచ్చిన ప్రపంచంలోనే తొలి ఎస్యూవీ ఇదే కావడం విశేషం. ఈ కొత్త Scorpio-N దేశంలోని అన్ని ఎస్యూవీలకు బిగ్ డాడీగా మార్కెట్లోకి వచ్చేసింది. ఐదు వేరియంట్లు జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8, జెడ్8ఎల్లతో మహింద్రా కొత్త స్కార్పియో-ఎన్ అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ను పాత తరం స్కార్పియోతో పాటే కంపెనీ విక్రయించనుంది. ఈ ఎస్యూవీపై కంపెనీ కొత్త లోగో ఉంది. మహింద్రా తన కొత్త లోగోతో తీసుకొచ్చిన రెండో వెహికిల్ ఇది. ఇప్పటికే Mahindra XUV700 ను కొత్త లోగోతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వాహనం రోడ్లపై చక్కర్లు కొడుతూ.. వాహనదారులను ఆకట్టుకుంటోంది. Mahindra Scorpio-N దేశంలో ఉన్న టాటా సఫారి, టాటా హ్యారియర్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ అలకజార్, టయోటా ఫార్చ్యూనర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అన్ని కొత్త కాంపోనెంట్లతో మహింద్రా తన కొత్త స్కార్పియో ఎన్ను రూపొందించింది. కొత్తగా లాంచైన ఈ ఎస్యూవీ ధర ఎక్స్షోరూంలో రూ.12 లక్షల నుంచి ప్రారంభమవుతున్నట్టు కంపెనీ చెప్పింది.
Also read : EPFO : గుడ్న్యూస్, ఆ ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా పీఎఫ్, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్..?
కొత్త స్కార్పియో ఎన్ యాడ్-టూ-ఆప్షన్ను జూలై 5 నుంచి అందుబాటులో ఉంచుతుంది. అలాగే బుకింగ్స్ను జూలై 30, 2022 నుంచి ప్రారంభిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. డీలర్షిప్ల వద్ద, ఆన్లైన్లో ఈ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో బుకింగ్స్ను చేపట్టి, డెలివరీలను పండగ సీజన్ నుంచి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. బుకింగ్స్ను మార్చుకునేందుకు కస్టమర్లకు రెండు వారాల అవకాశం కూడా ఉంటుంది.
భారత ఎస్యూవీ స్పేస్ను ఈ వెహికిల్ మార్చనుందని మహింద్రా భావిస్తోంది. ఫెదర్ లైట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, 4 డిస్క్ బ్రేక్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్సీ, డ్రైవర్ మగతను గుర్తించే సిస్టమ్, ఈబీడీతో ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చింది. స్కార్పియో ఎన్ ఎస్యూవీకి 2.2 లీటరు డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 175 పీఎస్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటరు టర్బో పెట్రోల్ ఇంజిన్ను కూడా ఈ ఎస్యూవీలో కంపెనీ ఆఫర్ చేస్తుంది.
Also read : పాన్-ఆధార్ లింక్కి ముగుస్తోన్న గడువు.. ఆ తర్వాత రెట్టింపు కానున్న పెనాల్టీ
Also read : EPFO : గుడ్న్యూస్, ఆ ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా పీఎఫ్, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్..?
కొత్త స్కార్పియో ఎన్ యాడ్-టూ-ఆప్షన్ను జూలై 5 నుంచి అందుబాటులో ఉంచుతుంది. అలాగే బుకింగ్స్ను జూలై 30, 2022 నుంచి ప్రారంభిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. డీలర్షిప్ల వద్ద, ఆన్లైన్లో ఈ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ చెప్పింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో బుకింగ్స్ను చేపట్టి, డెలివరీలను పండగ సీజన్ నుంచి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. బుకింగ్స్ను మార్చుకునేందుకు కస్టమర్లకు రెండు వారాల అవకాశం కూడా ఉంటుంది.
భారత ఎస్యూవీ స్పేస్ను ఈ వెహికిల్ మార్చనుందని మహింద్రా భావిస్తోంది. ఫెదర్ లైట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, 4 డిస్క్ బ్రేక్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్సీ, డ్రైవర్ మగతను గుర్తించే సిస్టమ్, ఈబీడీతో ఏబీఎస్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ ఎస్యూవీ మార్కెట్లోకి వచ్చింది. స్కార్పియో ఎన్ ఎస్యూవీకి 2.2 లీటరు డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 175 పీఎస్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటరు టర్బో పెట్రోల్ ఇంజిన్ను కూడా ఈ ఎస్యూవీలో కంపెనీ ఆఫర్ చేస్తుంది.
Also read : పాన్-ఆధార్ లింక్కి ముగుస్తోన్న గడువు.. ఆ తర్వాత రెట్టింపు కానున్న పెనాల్టీ