యాప్నగరం

New Scorpio Classic SUV: మహింద్రా కొత్త స్కార్పియో క్లాసిక్... పాపులారిటీ మామూలుగా లేదుగా!

New Scorpio Classic SUV: దేశంలో అతిపెద్ద ఎస్‌యూవీ తయారీదారిగా ఉన్న ఆటో దిగ్గజం మహింద్రా.. తన సరికొత్త ఎస్‌యూవీలతో ఈ మధ్య మార్కెట్లో పరుగులు పెడుతోంది. భారతీయ రోడ్లపై మహింద్రా ఎస్‌యూవీలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. మహింద్రా ఎస్‌యూవీలకు కస్టమర్ల నుంచి రెస్పాన్స్ కూడా బాగుంది. వీటిని ఇప్పుడు బుక్ చేసుకుంటే.. వాహనదారుల చేతికి రావడం కూడా ఆలస్యమవుతోంది. అంత డిమాండ్ ఈ కార్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో మహింద్రా మరో సరికొత్త ఎస్‌యూవీతో మీ ముందుకు వచ్చేసింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 12 Aug 2022, 2:48 pm

ప్రధానాంశాలు:

  • స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
  • ధర రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్యలోనే
  • ఈ నెల చివరిలో ధరలపై అధికారిక ప్రకటన
  • స్కార్పియో ఫ్యాన్ బేస్‌ను కొనసాగించేందుకు కొత్త వెహికిల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu New Scorpio Classic SUV
సరికొత్త స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ
New Scorpio Classic SUV: మహింద్రా తన సరికొత్త స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీని శుక్రవారం ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుత స్కార్పియో-ఎన్ మోడల్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత స్కార్పియో -ఎన్ మోడల్ ధర ఎక్స్‌షోరూంలలో రూ.11.99 లక్షల నుంచి రూ.23.90 లక్షల మధ్యలో ఉంది. కానీ సరికొత్త స్కార్పియో క్లాసిక్ వెహికిల్ ధర ఎక్స్‌షోరూంలో రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్యలోనే పలకనుంది. ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ ధరలను మహింద్రా ఈ నెల చివరిలో ప్రకటించనుంది.
పాత తరానికి చెందిన స్కార్పియో ఫ్యాన్ బేస్‌ను కొనసాగించేందుకు సరికొత్తగా స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీని కంపెనీ లాంచ్ చేసింది. సరికొత్తగా స్కార్పియో-ఎన్‌ను లాంచ్ చేసిన తర్వాత.. ఈ వెహికిల్‌ను తీసుకొచ్చింది. స్కార్పియో బ్రాండ్‌కు తన కస్టమర్ల బేస్‌ను పెంచేందుకు మహింద్రా చూస్తోంది. ఈ రెండు కార్లు కూడా అమ్మకంలో ఉండనున్నాయి. ఎక్స్‌టీరియర్ అప్‌గ్రేడ్లలో భాగంగా.. కొత్త స్కార్పియో క్లాసిక్‌కు సరికొత్తగా బ్లాక్, క్రోమ్ ఫినిష్‌లో ఫ్రంట్ గ్రిల్‌ను ఇచ్చింది. అంతేకాక జంట శిఖరాల చిహ్నాన్ని కూడా అందిస్తుంది.

హైయర్ ట్రిమ్స్‌పై 17 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్‌పై ఈ మోడల్ నడవనుంది. అయితే బేస్ మోడల్‌కి మాత్రం స్టీల్ వీల్స్ ఉండనున్నాయి. కారుకి వెలుపల అతిపెద్ద టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. ఈ వెహికిల్‌ డ్రైవింగ్‌ను మెరుగుపరిచేందుకు పూర్తిగా సరికొత్త సిస్టమ్‌ను స్కార్పియో క్లాసిక్‌లో ఇన్‌స్టాల్ చేస్తుందని తెలుస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ 2.2 లీటరు డీజిల్ ఇంజిన్‌తో, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి రాబోతుందని అంచనా. ఖర్చులను తగ్గించేందుకు స్కార్పియో క్లాసిక్‌లో 4డబ్ల్యూడీ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కంపెనీ ఈ కారులో వాడలేదు.

మహింద్రా ఇటీవల తీసుకొచ్చిన స్కార్పియో ఎన్ వెహికల్‌కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన రోజు తొలి 30 నిమిషాల్లోనే లక్షకు పైగా కార్లను బుక్ చేసుకున్నారు కస్టమర్లు. గ్రే మార్కెట్లో కూడా స్కార్పియో ఎన్ బుకింగ్స్ పూర్తిగా అమ్ముడుపోయాయి. ప్రతి రోజూ ఈ వెహికిల్స్ పాపులారిటీ సరికొత్త స్థాయిలను తాకుతున్నాయి.

Also Read :త్వరలోనే దిగిరానున్న సీఎన్‌జీ, వంటగ్యాస్ ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read : కెమికల్స్ స్టాక్‌లో కాసుల వర్షం.. బ్రేకవుట్‌తో దూసుకెళ్తున్నాయ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.