యాప్నగరం

Stock Market Today: సూచీల ఒడుదొడుకులు.. నష్టాల్లో ఆయిల్ సంస్థల షేర్లు

సోమవారం భారీ లాభాలతో ముగిసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 30 Oct 2018, 10:22 am
సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు. మంగళవారం ట్రేడింగ్‌ను మాత్రం ఫ్లాట్‌గా ప్రారంభించాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ ఆ వెంటనే 100 పాయింట్ల వరకూ నష్టపోగా.. నిఫ్టీ 10,200 పైస్థాయిలో ట్రేడైంది. కాసేపటి తర్వాత నష్టాల నుంచి కోలుకున్న సూచీలు మళ్లీ లాభాల బాటపట్టాయి. ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయిల్ సంస్థ షేర్లు పతనమయ్యాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
Samayam Telugu sensex


ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్ 62 పాయింట్ల లాభంతో 34,117.78 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 10247 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరులో రూపాయి మారకం విలువ 16 పైసలు క్షీణించి 73.61 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో టాటామోటార్స్, గ్రాసిమ్, ఇండియా బుల్స్ హౌసింగ్, గెయిల్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్ తదితర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, రిలయన్స్, కోల్ ఇండియా తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.