స్టాక్ మార్కెట్లు శిఖర స్థాయి లాభాలకు ఎగబాకాయి. వరసగా మూడు రోజుల సెలవుల అనంతరం మంగళవారం (డిసెంబర్ 26) ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ సూచీలు ఆరంభంలోనే మంచి లాభాలను నమోదు చేశాయి. అనంతరం కాస్త వెనక్కి తగ్గినా.. చివరికి రికార్డ్ స్థాయిలో ముగిశాయి. కీలక సూచీ సెన్సెక్స్ 34 వేల మార్కును అందుకోవడం విశేషం కాగా.. నిఫ్టీ కూడా ఇదే బాటలో 44 పాయింట్లు ఎగబాకి 10,500 మార్కును అందుకుంది. దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల పంటపడింది. మెటల్ సెక్టార్ అత్యధిక లాభాలను దక్కించుకుంది.
మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 34,010.61 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,531.50 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా బలపడింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 64.08గా కొనసాగుతోంది.
సిప్లా, బాష్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారతి ఎయిర్టెల్ భారీగా లాభ పడ్డాయి. డీఎల్ఎఫ్, సెయిల్, జెట్ ఎయిర్వేస్ 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం. జస్ట్ డయల్, జేపీ అసోసియేట్ కూడా మంచి లాభాలను ఆర్జించాయి.
అనిల్ అంబానీ ‘ఆర్ కాం’ ఎంట్రీతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను సొంతం చేసుకున్నట్లు విశ్లేషకులు వివరించారు. ఎస్డీఆర్ ప్రకటనతో ఆర్ కాం 40 శాతానికిపైగా లాభపడింది. మరోవైపు కోల్ ఇండియా, ఎస్బీఐ, ఐవోసీ, ఎన్టీపీసీ, హెచ్యూఎల్, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్ స్వల్పంగా నష్టాలను చవిచూశాయి.
మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 34,010.61 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,531.50 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా బలపడింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 64.08గా కొనసాగుతోంది.
సిప్లా, బాష్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారతి ఎయిర్టెల్ భారీగా లాభ పడ్డాయి. డీఎల్ఎఫ్, సెయిల్, జెట్ ఎయిర్వేస్ 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేయడం విశేషం. జస్ట్ డయల్, జేపీ అసోసియేట్ కూడా మంచి లాభాలను ఆర్జించాయి.
అనిల్ అంబానీ ‘ఆర్ కాం’ ఎంట్రీతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను సొంతం చేసుకున్నట్లు విశ్లేషకులు వివరించారు. ఎస్డీఆర్ ప్రకటనతో ఆర్ కాం 40 శాతానికిపైగా లాభపడింది. మరోవైపు కోల్ ఇండియా, ఎస్బీఐ, ఐవోసీ, ఎన్టీపీసీ, హెచ్యూఎల్, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్ స్వల్పంగా నష్టాలను చవిచూశాయి.