యాప్నగరం

వరసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ల దూకుడు

వరసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి. దలాల్‌ స్ట్రీట్‌లో కొనుగోళ్ల మోతతో బుల్‌ పరుగులు తీసింది. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం మార్కెట్లకు కలిసొచ్చింది.

TNN 8 Dec 2017, 5:55 pm
వరసగా రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి. దలాల్‌ స్ట్రీట్‌లో కొనుగోళ్ల మోతతో బుల్‌ పరుగులు తీసింది. కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం మార్కెట్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం కూడా దీనికి తోడైంది. దీంతో దిగ్గజ కంపెనీల్లో మదుపర్లు భారీగా పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లు లాభపడి మరోసారి 33000 మైలురాయిని అందుకోగా.. నిఫ్టీ 10200 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది.
Samayam Telugu markets close on positive mood sensex up by 300 points
వరసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ల దూకుడు


నిన్నటి ఊపును కొనసాగిస్తూ శుక్రవారం (డిసెంబర్ 8) ఉదయం 150 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్‌.. మార్కెట్ ముగిసేవరకూ అదే జోరును కొనసాగించింది. ఆయిల్, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్ల అండతో భారీ లాభాలను సాధించింది.

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 301 పాయింట్లు లాభపడి 33,250.30 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 98.95 పాయింట్లు ఎగబాకి 10,265.65 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.47గా కొనసాగుతోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో హిందుస్థాన్‌ పెట్రోలియం, ఐటీసీ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.