యాప్నగరం

ఇంధ‌న‌, స్థిరాస్తి రంగాల రాణింపు.. లాభాల్లో మార్కెట్లు

అంత‌ర్జాతీయంగా సానుకూల సంకేతాల నేప‌థ్యంలో దేశీయ ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు మొగ్గుచూప‌డంతో మ‌న మార్కెట్ల‌లో సెంటిమెంటు మెరుగయింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్‌ 294 పాయింట్లు ఎగ‌బాకి 34,300 వద్ద నిలవగా.. నిఫ్టీ 85 పాయింట్లు ఎసగి 10,540 వద్ద స్థిరపడింది.

TNN & Agencies 12 Feb 2018, 4:53 pm
గ‌త వారం భారీగా న‌ష్ట‌పోయిన మార్కెట్లు ఈ రోజు ట్రేడింగ్‌లో కాస్త కోలుకున్నాయి. అంత‌ర్జాతీయంగా సానుకూల సంకేతాల నేప‌థ్యంలో దేశీయ ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు మొగ్గుచూప‌డంతో మ‌న మార్కెట్ల‌లో సెంటిమెంటు మెరుగయింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి సెన్సెక్స్‌ 294 పాయింట్లు ఎగ‌బాకి 34,300 వద్ద నిలవగా.. నిఫ్టీ 85 పాయింట్లు ఎసగి 10,540 వద్ద స్థిరపడింది.
Samayam Telugu markets gained due to international factors
ఇంధ‌న‌, స్థిరాస్తి రంగాల రాణింపు.. లాభాల్లో మార్కెట్లు


బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ప‌వ‌ర్(1.87%), స్థిరాస్తి(1.73%), మూల‌ధ‌న వ‌స్తువులు(1.65%), మౌలిక రంగం(1.47%)లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు ఐటీ(0.47%), టెక్నాల‌జీ(0.43%) రంగాలు ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డ్డ‌, న‌ష్ట‌పోయిన కంపెనీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. టాటా స్టీల్(4.22%), యెస్ బ్యాంక్(2.89%), ప‌వ‌ర్ గ్రిడ్(2.51%), ఇండ‌స్ఇండ్ బ్యాంక్(2.12%), హీరో మోటోకార్ప్(1.94%), రిల‌య‌న్స్(1.87%), హెచ్‌డీఎఫ్‌సీ(1.82%), మారుతి(1.78%), ఓఎన్జీసీ(1.65%), ఎల్ అండ్ టీ(1.63%) ఎక్కువ‌గా లాభ‌ప‌డ్డాయి. మ‌రో వైపు ఎస్బీఐఎన్(2.67%) బాగా న‌ష్ట‌పోయింది. ఇంకా న‌ష్ట‌పోయిన వాటిలో ఇన్ఫోసిస్(0.72%), ఐటీసీ(0.53%), ఎం అండ్ ఎం(0.43%), ఐసీఐసీఐ బ్యాంక్(0.23%), టీసీఎస్(0.15%) మొద‌లైన‌వి ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.