యాప్నగరం

పీఎన్బీ దెబ్బ‌... మార్కెట్ల దిగాలు

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు రోజు మొత్తం నీరసంగా కదిలి చివరికి నష్టాలతో ముగిశాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత లాభాల సెంచరీతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆపై అమ్మకాల ఒత్తిడితో కొన‌సాగింది.

TNN & Agencies 27 Feb 2018, 4:41 pm
వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లు రోజు మొత్తం నీరసంగా కదిలి చివరికి నష్టాలతో ముగిశాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత లాభాల సెంచరీతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆపై అమ్మకాల ఒత్తిడితో కొన‌సాగింది. రోజంతా నష్టాల మధ్యే కదిలింది. చివరికి 99 పాయింట్ల క్షీణతతో 34,346 వద్ద ముగిసింది. ఈ బాటలో 10,631-10,537 పాయింట్ల మధ్య ఊగిసలాడిన నిఫ్టీ 28 పాయింట్లు తగ్గి 10,554 వద్ద స్థిరపడింది. పీఎన్‌బీలో జరిగిన నీరవ్‌ మోడీ ఎల్‌వోయూ కుంభకోణం మరింత పెద్ద‌ద‌ని తేల‌డంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Samayam Telugu markets lost on sunday due to pnb fraud case pressure
పీఎన్బీ దెబ్బ‌... మార్కెట్ల దిగాలు



బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో భార‌తీ ఎయిర్టెల్(2.07%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.82%), హీరో మోటోకార్ప్(1.64%), ఎన్టీపీసీ(1.53%), రిల‌య‌న్స్(1.21%), ప‌వ‌ర్ గ్రిడ్(1.12%) మొద‌లైన కంపెనీలు 1శాతం కంటే ఎక్కువ‌గా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు యాక్సిస్ బ్యాంక్(2.68%), ఎస్బీఐఎన్(2.53%), స‌న్ ఫార్మా(2.02%), ఐసీఐసీఐ బ్యాంక్(1.56%), ఓఎన్జీసీ(1.23%), టాటా స్టీల్(1.23%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.