యాప్నగరం

స్టాక్ మార్కెట్ల దూకుడు.. నిఫ్టీ @10000

ఆసియా నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 11) లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 194.64 పాయింట్లు, నిఫ్టీ 71.25 పాయింట్లు లాభపడ్డాయి. ఈ సీజన్‌లో ఎన్‌ఎస్ఈ నిఫ్టీ రెండోసారి పది వేల మార్కును అందుకోవడం విశేషం..

TNN 11 Sep 2017, 6:20 pm
ఆసియా నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 11) లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 194.64 పాయింట్లు, నిఫ్టీ 71.25 పాయింట్లు లాభపడ్డాయి. ఈ సీజన్‌లో ఎన్‌ఎస్ఈ నిఫ్టీ రెండోసారి పది వేల మార్కును అందుకోవడం విశేషం. షేర్ మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ ఘనత సాధించిన నిఫ్టీ చివరి వరకూ అదే దూకుడు కొనసాగించి 10006.05 వద్ద ముగిసింది. బీఎస్‌సీ సెన్సెక్స్ 31882.16 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో ఇది 222 పాయింట్ల లాభపడింది. దాదాపుగా అన్ని రంగాలు లాభాల బాటలో పయనించాయి.
Samayam Telugu markets register major gains as nifty reclaims 10000 mark
స్టాక్ మార్కెట్ల దూకుడు.. నిఫ్టీ @10000


అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాల షేర్ల అండతో ఆరంభం నుంచే ట్రేడింగ్‌ ఉత్సాహంగా సాగింది. ఫార్మా స్టాక్స్ కాస్త వెనకబడగా.. మెటల్ సెక్టార్ దూసుకెళ్లింది. లార్సెన్ అండ్ టర్బో, ఏషియన్ పేయింట్స్, మారుతీ, టాటా పవర్ భారీగా లాభపడగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండియా బుల్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.

మరోవైపు డాలర్‌ మాకరంలో రూపాయ బలహీనంగా ట్రేడ్‌ అయ్యింది. 0.013 పైసల స్వల్ప లాభంతో 63.93 వద్ద ఉంది. బంగారం మాత్రం స్వల్పంగా వెనకడుగేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.