ఆసియా నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 11) లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 194.64 పాయింట్లు, నిఫ్టీ 71.25 పాయింట్లు లాభపడ్డాయి. ఈ సీజన్లో ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండోసారి పది వేల మార్కును అందుకోవడం విశేషం. షేర్ మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ ఘనత సాధించిన నిఫ్టీ చివరి వరకూ అదే దూకుడు కొనసాగించి 10006.05 వద్ద ముగిసింది. బీఎస్సీ సెన్సెక్స్ 31882.16 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ దశలో ఇది 222 పాయింట్ల లాభపడింది. దాదాపుగా అన్ని రంగాలు లాభాల బాటలో పయనించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్ల అండతో ఆరంభం నుంచే ట్రేడింగ్ ఉత్సాహంగా సాగింది. ఫార్మా స్టాక్స్ కాస్త వెనకబడగా.. మెటల్ సెక్టార్ దూసుకెళ్లింది. లార్సెన్ అండ్ టర్బో, ఏషియన్ పేయింట్స్, మారుతీ, టాటా పవర్ భారీగా లాభపడగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండియా బుల్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
మరోవైపు డాలర్ మాకరంలో రూపాయ బలహీనంగా ట్రేడ్ అయ్యింది. 0.013 పైసల స్వల్ప లాభంతో 63.93 వద్ద ఉంది. బంగారం మాత్రం స్వల్పంగా వెనకడుగేసింది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాల్లో పయనించాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్ల అండతో ఆరంభం నుంచే ట్రేడింగ్ ఉత్సాహంగా సాగింది. ఫార్మా స్టాక్స్ కాస్త వెనకబడగా.. మెటల్ సెక్టార్ దూసుకెళ్లింది. లార్సెన్ అండ్ టర్బో, ఏషియన్ పేయింట్స్, మారుతీ, టాటా పవర్ భారీగా లాభపడగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇండియా బుల్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
మరోవైపు డాలర్ మాకరంలో రూపాయ బలహీనంగా ట్రేడ్ అయ్యింది. 0.013 పైసల స్వల్ప లాభంతో 63.93 వద్ద ఉంది. బంగారం మాత్రం స్వల్పంగా వెనకడుగేసింది.