Maruti New Brezza : దేశంలో అతిపెద్ద కారు తయారీదారి మారుతీ సుజుకి తనకాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా సరికొత్త వెర్షన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. నూతన తరం టెక్, సౌకర్యవంతమైన, కనెక్టెడ్ ఫీచర్లతో పాటు ఎలక్ట్రిక్ సన్రూఫ్తో కొత్త బ్రెజా మార్కెట్లోకి వచ్చింది. కొత్త బ్రెజా ధరని కంపెనీ ఎక్స్షోరూంలో రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్యలో నిర్ణయించింది. ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్లకు ఈ కొత్త బ్రెజా గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతీ సుజుకి అన్ని సెగ్మెంట్లలో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఎస్యూవీ సెగ్మెంట్పై ఈ కార్ల కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ కొత్త బ్రెజా వాహనాన్ని డెవలప్ చేసేందుకు మారుతీ సుజుకి తన సప్లయి పార్టనర్లతో కలిసి రూ.760 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. గత 8 నెలల్లో కంపెనీ తీసుకొచ్చిన ఆరవ వాహనం ఇది.
మారుతీ సుజుకి కొత్త బ్రెజా 3 సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అంతేకాక 3 ట్రెండీ డ్యూయల్ టోన్ రంగులలో కూడా ఇది లభిస్తుంది. కొత్త బ్రెజాలో లోపలున్న కేబిన్లో భారీ మార్పులు చేసింది కంపెనీ. ఇన్టైన్మెంట్ స్క్రీన్ను మధ్యలో పెద్దగా ఏర్పాటు చేసింది. తాజా ఇంటీరియర్ కలర్స్ను ఇచ్చింది. రెండో వరుస సీట్లుకాస్త వెడల్పుగా పెద్దగా ఉన్నాయి. సరికొత్తగా సన్రూఫ్ను కూడా ఇచ్చింది.
Also Read : రేపటి నుంచి 3 కొత్త రూల్స్ .. పన్ను చెల్లింపుదారులు తప్పక తెలుసుకోవాలి!
మారుతీ సుజుకి కొత్త బ్రెజా లీటరుకు 20.15 కి.మీ వరకు మైలేజ్ను ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యంత ఇంధన సమర్థవంతమైన ఎస్యూవీలలో ఒకటి. ఈ వాహనాన్ని పూర్తిగా భారత్లోనే డిజైన్ చేసి, భారత్లోనే రూపొందించింది.
గత ఎనిమిది రోజుల్లోనే ఈ కారు కోసం 45 వేలకు పైగా బుకింగ్స్ వచ్చినట్టు కంపెనీ కన్ఫామ్ చేసింది. ఈ కారుకి భారీగా డిమాండ్ వస్తున్నట్టు పేర్కొంది. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ను ఇది అందిస్తోంది. యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రెజాను కంపెనీ లాంచ్ చేసింది.
Also Read : భారీ సంఖ్యలో ఉద్యోగులను బయటికి పంపేస్తోన్న ఫార్మా దిగ్గజం
మారుతీ సుజుకి కొత్త బ్రెజా 3 సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అంతేకాక 3 ట్రెండీ డ్యూయల్ టోన్ రంగులలో కూడా ఇది లభిస్తుంది. కొత్త బ్రెజాలో లోపలున్న కేబిన్లో భారీ మార్పులు చేసింది కంపెనీ. ఇన్టైన్మెంట్ స్క్రీన్ను మధ్యలో పెద్దగా ఏర్పాటు చేసింది. తాజా ఇంటీరియర్ కలర్స్ను ఇచ్చింది. రెండో వరుస సీట్లుకాస్త వెడల్పుగా పెద్దగా ఉన్నాయి. సరికొత్తగా సన్రూఫ్ను కూడా ఇచ్చింది.
Also Read : రేపటి నుంచి 3 కొత్త రూల్స్ .. పన్ను చెల్లింపుదారులు తప్పక తెలుసుకోవాలి!
మారుతీ సుజుకి కొత్త బ్రెజా లీటరుకు 20.15 కి.మీ వరకు మైలేజ్ను ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యంత ఇంధన సమర్థవంతమైన ఎస్యూవీలలో ఒకటి. ఈ వాహనాన్ని పూర్తిగా భారత్లోనే డిజైన్ చేసి, భారత్లోనే రూపొందించింది.
గత ఎనిమిది రోజుల్లోనే ఈ కారు కోసం 45 వేలకు పైగా బుకింగ్స్ వచ్చినట్టు కంపెనీ కన్ఫామ్ చేసింది. ఈ కారుకి భారీగా డిమాండ్ వస్తున్నట్టు పేర్కొంది. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ను ఇది అందిస్తోంది. యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రెజాను కంపెనీ లాంచ్ చేసింది.
Also Read : భారీ సంఖ్యలో ఉద్యోగులను బయటికి పంపేస్తోన్న ఫార్మా దిగ్గజం