మారుతీ సుజుకీ బుడ్డ కారు ఆల్టోకు భారత్లో ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏటా దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నా కారుగా ఆల్టో రికార్డులు నెలకొల్పుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే దారిలో దూసుకుపోతోంది. 2017 మొదటి ఐదు నెలల్లో దేశ వ్యాప్తంగా లక్ష ఆల్టో కార్లను విక్రయించినట్లు మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించింది. ఎంట్రీ లెవెల్ విభాగంలో తనకు ఎదురులేదని ఆల్టో మరోసారి నిరూపించింది.
ఆల్టో కారును మారుతీ సుజుకీ సెప్టెంబర్ 2000లో ప్రవేశపెట్టింది. మొదటి మూడేళ్లలో ఏడాదికి లక్ష చొప్పున అమ్మకాలను ఆల్టో నమోదు చేసింది. అప్పటి నుంచి భారత్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా ఏటా ఆల్టో నిలుస్తూనే ఉంది. మొదటిసారి కారు కొంటున్నవారు, యువత కారణంగానే ఆల్టో సేల్స్ బాగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఆల్టో కారును కొంటున్న వారిలో 25 శాతం మంది 30 ఏళ్ల కింద వయసువారేనని తెలిపింది. శ్రీలంక, చిలీ, ఫిలిప్పీన్స్ ఉరుగ్వే దేశాలకు కిందటేడాది 21వేల ఆల్టో కార్లను ఎగుమతి చేసినట్లు చెప్పింది.
కాగా, భారత్లో చిన్న కార్ల బిజినెస్ బాగా పెరిగింది. దీనికి అనుగుణంగా కార్ల కంపెనీలు చిన్న కార్లపైనే దృష్టి పెట్టాయి. రెనో తీసుకొచ్చిన క్విడ్ కారు ఆల్టోకు తీవ్రమైన పోటీని ఇస్తోంది. అలాగే హుందయ్ గ్రాండ్ ఐ10 సైతం మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ఇంత పోటీ ఉన్నప్పటికీ మారుతీ సుజుకీ ఆల్టోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆల్టో కారును మారుతీ సుజుకీ సెప్టెంబర్ 2000లో ప్రవేశపెట్టింది. మొదటి మూడేళ్లలో ఏడాదికి లక్ష చొప్పున అమ్మకాలను ఆల్టో నమోదు చేసింది. అప్పటి నుంచి భారత్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా ఏటా ఆల్టో నిలుస్తూనే ఉంది. మొదటిసారి కారు కొంటున్నవారు, యువత కారణంగానే ఆల్టో సేల్స్ బాగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఆల్టో కారును కొంటున్న వారిలో 25 శాతం మంది 30 ఏళ్ల కింద వయసువారేనని తెలిపింది. శ్రీలంక, చిలీ, ఫిలిప్పీన్స్ ఉరుగ్వే దేశాలకు కిందటేడాది 21వేల ఆల్టో కార్లను ఎగుమతి చేసినట్లు చెప్పింది.
కాగా, భారత్లో చిన్న కార్ల బిజినెస్ బాగా పెరిగింది. దీనికి అనుగుణంగా కార్ల కంపెనీలు చిన్న కార్లపైనే దృష్టి పెట్టాయి. రెనో తీసుకొచ్చిన క్విడ్ కారు ఆల్టోకు తీవ్రమైన పోటీని ఇస్తోంది. అలాగే హుందయ్ గ్రాండ్ ఐ10 సైతం మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. ఇంత పోటీ ఉన్నప్పటికీ మారుతీ సుజుకీ ఆల్టోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది.