యాప్నగరం

భారత్‌లో బెంజ్ రికార్డు అమ్మకాలు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో దూసుకుపోతోంది.

TNN 11 Apr 2017, 2:24 pm
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో దూసుకుపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా భారత్‌లో తమ కార్ల అమ్మకాలను పెంచేసింది. భారత్‌లో ఓ త్రైమాసికంలో 3,650 కార్లను విక్రయించడం ఇదే తొలిసారని మంగళవారం కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో తమ అమ్మకాలు ఇంత బాగా పెరగడానికి కొత్త ఇ-క్లాస్ సెడాన్, జీఎల్‌సీ క్లాస్ ఎస్‌యూవీలే కారణమని కంపెనీ వివరించింది.
Samayam Telugu mercedes benz reports record sales for january march quarter
భారత్‌లో బెంజ్ రికార్డు అమ్మకాలు


గతేడాది ఇదే త్రైమాసికంలో 3,622 కార్లను విక్రయించిన మెర్సిడెస్ బెంజ్ ఈ సంవత్సరం ఆ సంఖ్యను 3,650కి చేర్చింది. 2016లో మొత్తం 13,231 కార్లను భారత్‌లో విక్రయించింది. అయితే 2015తో పోలిస్తే ఇది 1.8 శాతం తక్కువ. అయితే ఈ ఏడాది తమ కంపెనీ వృద్ధి వేగం పుంజుకుందని, తొలి త్రైమాసికం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోలాండ్ ఫోల్గర్ వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలచేసిన ఇ-క్లాస్ సెడాన్ మోడల్ ఈ త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడుపోయిందని చెప్పారు. కేవలం ఆరు రోజుల్లోనే 500 ఇ-క్లాస్ కార్లను విక్రయించామన్నారు. అదే సమయంలో ఎస్‌యూవీ విభాగంలో కూడా 13 శాతం వృద్ధి సాధించమని తెలిపారు. దీనికి కారణం కొత్త జీఎల్‌సీ క్లాస్ ఎస్‌యూవీ అని చెప్పారు. మరో ఏడాది కాలంలో టైర్ 2, టైర్ 3 సిటీలకు మెర్సిడెస్ బెంజ్ సేవలను విస్తరిస్తామని ఫోల్గర్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.