కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల మెగా విలీన ప్రక్రియను అనుకున్నట్లుగానే ముందుకు తీసుకెళ్తోంది. ఏప్రిల్ 1 నుంచి అంటే రేపటి నుంచి 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు 4 బ్యాంకులుగా మారిపోనున్నాయి. రిజర్వు బ్యాంక్ ఇప్పటికే ఈ విషయమై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విలీనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య దేశంలో 12కు తగ్గుతుంది. బ్యాంకుల విలీనం నేపథ్యంలో కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. బ్యాంకుల విలీనంతో బ్యాంక్ ఖాతాదారులకు సంబంధించిన అకౌంట్ నెంబర్, ఐఎస్ఎఫ్సీ కోడ్ సహా పలు అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని గతేడాది ఆగస్ట్ 30న ప్రకటించింది. ఇకపోతే మోదీ సర్కార్ 2017లో కూడా స్టేట్ బ్యాంక్లో (ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే.
Also Read: undefined
బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లపై ఎఫెక్ట్ పడుతుంది. కస్టమర్లకు కొత్త అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడీ వస్తాయి. ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మారుతుంది. దీంతో కొత్తగా అకౌంట్ నెంబర్ పొందిన వారు ఇదే వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి వాటిల్లో మార్చుకోవలసి ఉంటుంది. సిప్ లేదా లోన్ ఈఎంఐ విషయానికి వస్తే.. కస్టమర్లు కొత్త ఇన్స్ట్రక్షన్ ఫామ్ను ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త చెక్బుక్, డెబిట్ కార్డు వంటివి కూడా రావొచ్చు.
Also Read: undefined
ఇకపోతే బ్యాంకుల విలీనం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే వెహికల్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి పలు రుణాలపై వడ్డీ రేట్లు కూడా మారవు. కొన్ని బ్యాంక్ బ్రాంచులు మూతపడే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ బ్రాంచ్ కస్టమర్లు మరొక బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ అవుతారు.
Also Read: undefined
బ్యాంకుల విలీనాన్ని పరిశీలిస్తే.. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అవుతాయి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో కలిసిపోతుంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండిలో విలీనం అవుతాయి. ఇక చివరిగా అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్లో కలిసిపోతుంది.
కాగా ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెనరా బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచులుగా పనిచేస్తాయి.
Also Read: undefined
బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లపై ఎఫెక్ట్ పడుతుంది. కస్టమర్లకు కొత్త అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడీ వస్తాయి. ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా మారుతుంది. దీంతో కొత్తగా అకౌంట్ నెంబర్ పొందిన వారు ఇదే వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి వాటిల్లో మార్చుకోవలసి ఉంటుంది. సిప్ లేదా లోన్ ఈఎంఐ విషయానికి వస్తే.. కస్టమర్లు కొత్త ఇన్స్ట్రక్షన్ ఫామ్ను ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త చెక్బుక్, డెబిట్ కార్డు వంటివి కూడా రావొచ్చు.
Also Read: undefined
ఇకపోతే బ్యాంకుల విలీనం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లు, రికరింగ్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే వెహికల్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి పలు రుణాలపై వడ్డీ రేట్లు కూడా మారవు. కొన్ని బ్యాంక్ బ్రాంచులు మూతపడే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ బ్రాంచ్ కస్టమర్లు మరొక బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ అవుతారు.
Also Read: undefined
బ్యాంకుల విలీనాన్ని పరిశీలిస్తే.. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అవుతాయి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో కలిసిపోతుంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండిలో విలీనం అవుతాయి. ఇక చివరిగా అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్లో కలిసిపోతుంది.
కాగా ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెనరా బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచులుగా పనిచేస్తాయి.