చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి తమకు సాయం అందించాలని దేశీ మొబైల్ కంపెనీలు మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్, కార్బన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అత్యంత పోటీ ఉన్న భారత మార్కెట్లో ఆర్థికంగా చాలా బలమైన చైనా కంపెనీల వల్ల దేశీ కంపెనీలు మరుగున పడిపోతున్నాయని మొరపెట్టుకున్నాయి.
భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ మార్కెట్లో సగానికిపైగా సొంతం చేసుకున్న చైనా కంపెనీలు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్ను ముందుకు తీసుకెళ్లలేవని వాదించాయి. రూ. 5వేల కంటే తక్కువ బడ్జెట్లో చైనా కంపెనీలు స్మార్ట్ఫోన్లను తీసుకురావడం లేదని, ఈ విభాగాన్ని దేశీ కంపెనీలు మాత్రమే నిర్వహిస్తున్నాయని ప్రభుత్వానికి వెల్లడించాయి.
దేశీ మొబైల్ కంపెనీలు పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లేదంటే మౌలికసదుపాయాలు వంటి సహాకారాలు అందాలని ఇంటెక్స్ టెక్నాలజీస్ పేర్కొంది. చైనా, అమెరికా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు స్థానికి కంపెనీల మనుగడకు ఇలాంటి సహకారాలు అందిస్తున్నాయని గుర్తుచేసింది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో కూడా దేశీ మొబైల్ కంపెనీలే మొదట చేరాయని తెలిపింది. కాగా, ఉత్తర ప్రదేశ్లో నెలకొల్పిన తన ఆరో తయారీ కేంద్రంలో ఇంటెక్స్ రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ యాక్ససరీస్ తయారుచేయనున్నారు.
చైనాకు చెందిన షియోమి, ఒప్పొ, వివో, లెనొవొ, జియోని కంపెనీలు భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 60 నుంచి 65 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. వీటి దెబ్బకి ఒకప్పుడు దేశీ దిగ్గజంగా ఎదిగిన మైక్రోమ్యాక్స్ ఇప్పుడు చాలా వెనకబడిపోయింది. అలాగే లావా, కార్బన్, సెల్కాన్ వంటి కంపెనీ మనుగడ చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ కంపెనీలు మొరపెట్టుకుంటున్నాయి.
భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ మార్కెట్లో సగానికిపైగా సొంతం చేసుకున్న చైనా కంపెనీలు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్ను ముందుకు తీసుకెళ్లలేవని వాదించాయి. రూ. 5వేల కంటే తక్కువ బడ్జెట్లో చైనా కంపెనీలు స్మార్ట్ఫోన్లను తీసుకురావడం లేదని, ఈ విభాగాన్ని దేశీ కంపెనీలు మాత్రమే నిర్వహిస్తున్నాయని ప్రభుత్వానికి వెల్లడించాయి.
దేశీ మొబైల్ కంపెనీలు పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లేదంటే మౌలికసదుపాయాలు వంటి సహాకారాలు అందాలని ఇంటెక్స్ టెక్నాలజీస్ పేర్కొంది. చైనా, అమెరికా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు స్థానికి కంపెనీల మనుగడకు ఇలాంటి సహకారాలు అందిస్తున్నాయని గుర్తుచేసింది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో కూడా దేశీ మొబైల్ కంపెనీలే మొదట చేరాయని తెలిపింది. కాగా, ఉత్తర ప్రదేశ్లో నెలకొల్పిన తన ఆరో తయారీ కేంద్రంలో ఇంటెక్స్ రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, మొబైల్ యాక్ససరీస్ తయారుచేయనున్నారు.
చైనాకు చెందిన షియోమి, ఒప్పొ, వివో, లెనొవొ, జియోని కంపెనీలు భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 60 నుంచి 65 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. వీటి దెబ్బకి ఒకప్పుడు దేశీ దిగ్గజంగా ఎదిగిన మైక్రోమ్యాక్స్ ఇప్పుడు చాలా వెనకబడిపోయింది. అలాగే లావా, కార్బన్, సెల్కాన్ వంటి కంపెనీ మనుగడ చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ కంపెనీలు మొరపెట్టుకుంటున్నాయి.