యాప్నగరం

రూ.8 వేలకే భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్...!

మైక్రోమాక్స్ సంస్థ భారీ బ్యాటరీ సామర్థ్యం గల మరో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం (మార్చి 14) విడుదల చేసింది. 'భారత్ 5 ప్రొ' పేరుతో కేవలం రూ.7,999 ధరకు ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది.

TNN 14 Mar 2018, 8:16 pm
మైక్రోమాక్స్ సంస్థ భారీ బ్యాటరీ సామర్థ్యం గల మరో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం (మార్చి 14) విడుదల చేసింది. 'భారత్ 5 ప్రొ' పేరుతో కేవలం రూ.7,999 ధరకు ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న.. భారీ బ్యాటరీని ఏర్పాటు చేసింది. పవర్ బ్యాంక్‌లా కూడా వాడుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. దీనిద్వారా... ఇతర ఫోన్లను ఈ ఫోన్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఆటో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఫోన్ ముందు భాగంలో ఉండే కెమెరాతో ఫోన్‌ను ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేయవచ్చు. కేవలం సెకన్ కన్నా తక్కువ వ్యవధిలోనే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. బ్లాక్ కలర్‌లో మాత్రమే వినియోగదారులకు లభిస్తున్నది
Samayam Telugu micromax launches bharat 5 pro priced at rs 7999
రూ.8 వేలకే భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్...!

మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రొ ఫీచర్లు...
* 5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 1280 × 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ నూగట్
* డ్యూయల్ సిమ్
* 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్)
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.