యాప్నగరం

Mobile phones: మీ ఫోన్ పోయిందా? కొత్త వ్యవస్థ అమల్లోకి.. వెంటనే ట్రాక్ చేసి బ్లాక్ చేయొచ్చు!

Mobile Phones: మీ మొబైల్ ఫోన్ ఎవరైనా దొంగలించారా? లేదా ఎక్కడైనా పోయిందా.. ఇక ఏం కంగారు పడనక్కర్లేదు. CEIR సిస్టమ్, మొబైల్ నెట్‌వర్క్‌ల దగ్గర IMEI నంబర్స్, వాటికి అనుసంధానమైన మొబైల్ నంబర్ల జాబితా ఉంటుంది. దీంతో.. పోయిన ఫోన్లను ఈజీగా ట్రాక్ చేసి బ్లాక్ చేయొచ్చు.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 14 May 2023, 5:33 pm
Samayam Telugu MOBILE pHONES

Mobile Phones: పోగొట్టుకున్న ఫోన్లు లేదా దొంగతానానికి గురైన మొబైల్స్‌ను ట్రాక్ చేసి బ్లాక్ చేసే సరికొత్త సాంకేతికతను ఈ వారమే ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు ఒక ఉన్నతాధికారి చెప్పారు. 'సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమేటిక్స్ (CDoT) ఈ వ్యవస్థను అభివృద్ధి చేయగా.. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వ్యవస్థను మే 17న దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సదరు అధికారి చెప్పుకొచ్చారు. CDoT సీఈఓ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాత్రం దీని తేదీని ఇంకా ధ్రువీకరించలేదు.

అయితే ఈయన తేదీ చెప్పకపోయినా దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చూస్తున్నామని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన వ్యవస్థ సిద్ధంగానే ఉంది చెప్పుకొచ్చారు. మొబైల్ ఫోన్‌ను విక్రయించడం కంటే ముందే దాని IMEI నంబర్ బహిర్గతం చేయాలనేది నిబంధన. ఈ అధీకృత IMEI నంబర్స్ జాబితా.. మొబైల్ నెట్‌వర్క్‌ల వద్ద ఉంటుంది.



ఒకవేళ ఏమైనా అనధికారిక మొబైల్స్.. తమ నెట్‌‌వర్క్‌లోకి వస్తే టెలికాం సంస్థలు వెంటనే గుర్తించగలుగుతాయి. CEIR వ్యవస్థ, మొబైల్ నెట్‌వర్క్‌ల వద్ద ఐఎంఈఐ నంబర్లు, వాటికి అనుసంధానంగా ఉండే మొబైల్ నంబర్ల జాబితా కూడా ఉంటుంది. ఈ సమాచారంతోనే పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, బ్లాక్ చేస్తారు. దీనితో మొబైల్ ఫోన్ల దొంగతనాలు కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇంకా దొంగలను గుర్తించడం కూడా పోలీసులకు సులభం అవుతుంది.


డెబిట్ కార్డు వాడుతున్నారా.. అయితే ఈ 7 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.